seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 10:03 am Digital Edition : SEEMA KIRANAM

పదవ పరీక్షలు: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి | ప్రకాశంలో స్ఫూర్తిదాయకమైన చట్టం: ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా ఆక్సిజన్ సిలిండర్‌తో 10వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థి

ఆంధ్ర ప్రదేశ్

ఓయి-లింగారెడ్డి గజ్జల

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

అది ఒక పదో తరగతి పరీక్షా కేంద్రం. విద్యార్థులంతా తమ భవిష్యత్తు కోసం పెన్నులు పట్టుకుని సిద్ధమవుతున్నారు. కానీ, అందరి మధ్యలో ఒక విద్యార్థి మాత్రం ప్రాణవాయువు కోసం ఆక్సిజన్ మాస్క్ ధరించి, పక్కనే సిలిండర్ పెట్టుకుని కనిపిస్తున్నాడు. అతడి ఊపిరితిత్తులు మొరాయిస్తున్నా.. తన గమ్యం వైపు అడుగులు వేస్తున్న ఆ దృశ్యం చూసి అక్కడి వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నానికి చెందిన కౌశిక్ అనే విద్యార్థి సాగిస్తున్న ఈ ‘అక్షర సమరం’ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది.

కొత్తపట్నంకు కౌశిక్ గతంగా ఊపిరితిత్తుల సంబంధిత తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు. సొంతంగా గాలి పీల్చుకోవడం కూడా అతడికి భారమైపోయింది. డాక్టర్లు పరీక్షించి ‘ఊపిరితిత్తుల మార్పిడి’ (ఊపిరితిత్తుల మార్పిడి) ఒక్కటే మార్గమని తేల్చి చెప్పారు. అయితే, ఇందుకు ఏకంగా 50 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని అంటున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబానికి అంత ఆర్థిక స్థోమత లేదు. ప్రాణం ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితిలో ఉన్నా.. చదువుకోవాలంటే ఆ విద్యార్థి ఆశ మాత్రం చావలేదు.

ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా ఆక్సిజన్ సిలిండర్‌తో 10వ తరగతి పరీక్షకు హాజరైన ప్రకాశం విద్యార్థిలో స్ఫూర్తిదాయక చట్టం

సిలిండర్‌తోనే సెంటర్‌కు.. మాస్క్ ధరించి మరీ!

పదో తరగతి పరీక్షలు తన జీవితానికి కీలకమని భావించిన కౌశిక్, అనారోగ్యాన్ని సాకుగా చూపి వెనకడుగు వేయలేదు. తండ్రి సాయంతో ఆక్సిజన్ సిలిండర్‌ను వెంట తెచ్చుకుని, ముఖానికి ఆక్సిజన్ మాస్క్ తగిలించుకుని పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతున్నా, పెన్ను పట్టుకుని ఒక్కో అక్షరాన్ని తన ఆశయంగా మార్చుకుని రాశాడు. పరీక్షా హాలులో పక్కనే ఉన్న ఆక్సిజన్ సిలిండర్.. అతడి ప్రాణానికే కాదు, చదువుపై అతడికి తిరుగులేని పట్టుదల కనిపించింది.

సాయం కోసం తగిన ‘చిన్నారి ప్రాణం’

కౌశిక్ పట్టుదలను చూసి విద్యాశాఖ అధికారులు, స్థానికులు అభినందిస్తున్నా.. అతడిని వేధిస్తున్న అనారోగ్యం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఆ 50 లక్షల రూపాయలు సమకూరితేనే ఈ అక్షర యోధుడు పూర్తి స్థాయిలో ప్రాణాలతో బయటపడగలడు. ఆ చిన్నారి ప్రాణాన్ని కాపాడి, అతని చదువుల కోసం దాతలు ముందుకు రావాలని కౌశిక్ తల్లిదండ్రులు కన్నీళ్లతో వేడుకుంటున్నారు. విద్యార్థి రాసింది కేవలం పరీక్ష మాత్రమే కాదు.. మృత్యువుపై పోరాటం చేస్తూ రాసిన విజయాక్షరమాల ఇది.

ఆంగ్ల సారాంశం

ప్రకాశం జిల్లాలో ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న 10వ తరగతి విద్యార్థి కౌశిక్ తన బోర్డు పరీక్షలకు ఆక్సిజన్ సిలిండర్ మరియు మాస్క్‌తో హాజరయ్యాడు. అతని కుటుంబం ₹50 లక్షల మార్పిడి కోసం సహాయం కోరింది.

Source link