భారతదేశం
ఓయ్-జక్కీ మహేష్
<!--
--> <!-- -->ఉత్తరప్రదేశ్ బులంద్షహర్లో ఓ భర్త తన భార్య మొబైల్ ఫోన్లో చూసిన మెసేజ్ అతడి వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఏకంగా తన భార్యను ఆమె ప్రియుడితో అంగీకరించిన ఓ వింత, భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీకి చెందిన రాజ్కుమార్ అనే వ్యక్తికి తన భార్య ప్రవర్తనపై గతంలో అనుమానం ఉంది. ఆమె తరచూ తనతో గొడవ పడుతూ ప్రియుడి దగ్గరికి వెళ్లిపోయిందని అతడు ఆరోపిస్తున్నాడు. జులైలో తన 6 నెలల పసిబిడ్డను వదిలేసి మరీ ఆమె వెళ్లిపోయిందని.
ఆ మూడు ముక్కలే కొంపముంచాయి!
రాజ్కుమార్ తన భార్య ఫోన్ను లాక్కొని చెక్ చేయగా.. అందులో అతనికి దిమ్మతిరిగే విషయాలు కనిపించాయి. Facebookలో కొన్ని హత్యా ఉదంతాలకు సంబంధించిన పోస్టులు ఉండటమే కాకుండా.. “నీలిరంగు డ్రమ్, సిమెంట్” అనే క్యాప్షన్లతో తన ఫోటోలు ఉండటాన్ని గమనించాడు. నిజానికి ఇది మీరట్లో జరిగిన ఓ దారుణ హత్యను గుర్తు చేస్తోంది. 2025 మార్చిలో ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపి.. బాడీని ముక్కలుగా కోసి సిమెంట్ నింపిన నీలిరంగు డ్రమ్లో దాచిపెట్టింది. రాజ్కుమార్ భార్య కూడా సరిగ్గా అదే ప్లాన్ చేస్తోందని అతడికి అర్థమైంది. గొడవ జరిగిన ప్రతిసారీ “నిన్ను కూడా డ్రమ్ములో ప్యాక్ చేస్తాను” అని ఆమె బెదిరించేదని రాజ్కుమార్ వాపోయాడు.

ప్రియుడికే ఇచ్చేశాడు..
“ఆమెకు నేనంటే ఇష్టం లేదు. కనీసం వంట చేయడు, ఉతకదు. పసిబిడ్డను కూడా సరిగ్గా చూసుకోడు. ఫోన్ లాక్కున్నందుకు నన్నూ, నా ముగ్గురు సోదరులను చంపేస్తానని బెదిరించింది” అని రాజ్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల సమక్షంలో జరిగిన కౌన్సెలింగ్లో కూడా ఆమె తన ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన రాజ్కుమార్, ఆమె ప్రియుడిని పిలిపించి మరీ ఆమెను పంపించివేశాడు. తన ప్రాణాలు పోతే తన బిడ్డ అనాథ అవుతుందని భావించి.. ఆమె ప్రియుడిని పిలిపించి మరీ తన భార్యను అతనితో పంపించేసి గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్నాడు.
ఆంగ్ల సారాంశం
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన భార్య ఫోన్లో ‘బ్లూ డ్రమ్ మరియు సిమెంట్’ ఉన్న హత్య ప్లాట్లను కనుగొన్నాడు. ప్రాణభయంతో ఆమెను ప్రేమికుడితో విడిచిపెట్టాడు.