Saturday, March 14, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణనాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ | కరణ్ అదానీ కుటుంబ విలువలు...

నాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ | కరణ్ అదానీ కుటుంబ విలువలు తన నాయకత్వాన్ని మరియు నిర్ణయం తీసుకునే విధానాన్ని రూపొందించాయని చెప్పారు

📰 Generate e-Paper Clip


భారతదేశం

-Oneindia సిబ్బంది

క‌ర‌ణ్ అదానీ, అదానీ పోర్ట్స్ అండ్ స్పెష‌ల్ ఎక‌నామిక్ జోన్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా, అదానీ సిమెంట్ డైరెక్ట‌ర్‌గా కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. నగరంలో మార్చి 13న జరిగిన ఓ నాయక్‌త్వ స’దస్సులో మాట్లాడుతూ, త’న నాయక’త్వ శైలిని, నిర్ణయం తీసుకునే విధానం రూపుదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. వారి నుండి నేర్చుకున్న విలువలే వ్యాపార బాధ్యతలను, స’వాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి మార్గ దర్శకంగా నిలుస్తున్నాయ’ని వెల్లడించారు.

అదానీ గ్రూప్ ఛైర్మన్, త‌న తండ్రి గౌతమ్ అదానీ నుండి స్థితిస్థాప‌క‌త‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌, అలాగే ఓ నాయ‌కుడిగా అంద‌రికీ అందుబాటులో ఉండ‌టం ఎన్నో ముఖ్య‌మైన లీడ‌ర్‌షిప్ పాఠాల‌ను క‌ర‌ణ్ అదానీ నేర్చుకున్నట్లు తెలిపారు. చిన్నతనంలో త‌న తండ్రి నుండి వ‌చ్చిన ఓ ఫోన్ కాల్ త‌న‌పై శాశ్వ‌త ముద్ర వేసింద‌ని ఒక మ‌ధుర జ్ఞాప‌క‌ని పంచుకున్నారు.

ఆయన తండ్రి ఒకరోజు తెల్లవారుజామున సుమారు ఒంటి గంటకు ఫోన్ చేసి నిద్రపోతున్నావా అని అడిగారట. తాను నిద్రపోతున్నానని కరణ్ అదానీ చెప్పగానే, “బాధ్యత పిలిచినప్పుడు నాయకత్వం అందుబాటులో ఉండాలి” అని గౌతమ్ అదానీ సమాధానం ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఈ క్షణం నాయక’త్వానికి నిరంత‌ర అవ‌గాహ‌న‌, క‌ట్టుబాటు అవ‌స‌ర‌మ‌ని త‌న‌కు బ‌ల‌ప‌రిచింద‌ని ఆయన పేర్కొన్నారు.

త‌న తండ్రి ఎలాంటి స‌వాళ్లను ఎదుర్కొన్నా, భవిష్యత్తుపై గట్టి నమ్మకంతో ఎలా ముందుకు సాగాలో తాను ఎప్పుడూ గ‌మ‌నించిన‌ట్లు క‌ర‌ణ్ అదానీ చెప్పాడు. క‌ష్ట స‌మ‌యాల్లో కూడా దీర్ఘ‌కాలిక ల‌క్ష్య‌లపై దృష్టి సారించ‌డ‌మే ఆయ‌న నేర్పిన అత్యంత ముఖ్య‌మైన పాఠం అని కరణ్ అన్నారు. ఈ విలువలు నాయకత్వ శైలిని తన ప్రభావితం చేశాయని వివరించారు.

గౌతమ్ అదానీ ఎంత బాగా ఉన్నా, లేదా అత్యంత ముఖ్య‌మైన మీటింగ్‌లో ఉన్నా ఆయ‌న‌ను అప్ప‌టిక‌ప్పుడే అడ్డుకునేది ముగ్గురు మాత్ర‌మేన‌ని క‌ర‌ణ్ అదానీ ఒక ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నారు. ఆ ముగ్గురు మరెవరో కాదు, ఆయ‌న ముగ్గురు మ‌న‌వ‌రాళ్ల‌ని చెప్పారు. వారు గ‌డిలోకి వ‌చ్చిన‌ప్పుడు అత్యంత తీవ్ర‌మైన స‌మావేశాలు కూడా ఆగిపోతాయ‌ని, ఇది నాయ‌క‌త్వం, కుటుంబ జీవితం మ‌ధ్య స‌మతుల్య‌త‌ను సూచించ‌డం ఖాయం.

తల్లి ప్రీతి అదానీ ప్రభావం గురించి కూడా కరణ్ అదానీ ప్రస్తావించారు. అదానీ ఫౌండేషన్ ద్వారా ప్రీతి అదానీ విద్యా, ఆరోగ్య సంరక్షణ మ‌రియు స‌మాజాల‌లో సుస్థిర జీవనోపాధిపై దృష్టిసారించి సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలతో కలిసి ఆమె పనిచేయడం చూసి, నాయకత్వం కేవలం వ్యాపార విజయం కాదనీ, అంతకు మించి ఉంటుందని తాను అర్థం చేసుకున్నానని కరణ్ చెప్పారు.

వ్యాపార వృద్ధి అనేది ప్రజలకు, సమాజానికి అర్థవంతమైన ఉత్పాదకత కూడా సృష్టించాలని ఇది తనకు స్పష్టంగా తెలియజేసినట్లు కరణ్ అదానీ సూచించింది. త‌న త‌ల్లిదండ్రుల ప్రభావం స‌మతుల్య‌మైన నాయక‌త్వ దృక్ప‌థాన్ని అల‌వ‌ర్చుకోవ‌డంలో ఎంతో సాయ‌ప‌డింద‌ని ఆయ‌న అన్నారు. తండ్రి వ్యాపార విస్తరణకు కావాల్సిన విశ్వాసాన్ని నింపగా, తల్లి కరుణ, బాధ్య’త’ల ప్రాముఖ్య’తను బ‌ల‌ప‌రిచార‌ని వివ‌రించారు.

పోర్ట్‌లు, లాజిస్టిక్స్, ఇంధనం, విమానాశ్రయాలు, మెటీరియల్‌ల అనేక రంగాలలో అదానీ గ్రూప్ నిరంతరం విస్తరిస్తున్న తరుణంలో, సంస్థ తన ప్రధాన విలువలతో ముందుకు సాగుతుందని కరణ్ అదానీ అన్నారు. అభివృద్ధి వేగం, పరిమాణం చాలా ముఖ్యమైనప్పటికీ, శాశ్వత సంస్థలను నిర్మించడంలో కరుణ, బాధ్యత కూడా అంతే ముఖ్యమైనవని ఆయన స్పష్టం చేశారు.

త‌న త‌ల్లిదండ్రులు అందించిన వారసత్వం గురించి ఆలోచిస్తూ, క‌ర‌ణ్ అదానీ మాట్లాడుతూ, తనకు అందిన అత్యంత ముఖ్యమైన వారసత్వ అవకాశాలు కాదని, అది ఒక విస్తృత దృక్పథమని పేర్కొన్నారు. వ్యాపారాలు ఆస్తులను నిర్మిస్తాయి, కానీ విలువలు సంస్థలను బలోపేతం చేయడానికి ఆయ న అభిప్రాయపడ్డారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular