భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
<!--
--> <!-- -->దేశ రాజధానిపై ఉగ్రదాడి ముప్పు పొంచివుంది. ఈ మేరకు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, జాతీయ దర్యాప్తు సంస్థల హెచ్చరికలు జారీ చేశాయి. చారిత్రాత్మక రెడ్ ఫోర్ట్ తో పాటు పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరగొచ్చంటూ తెలిపాయి. నిత్యం జనంతో కిటకిటలాడే చాందినీ చౌక్ ప్రాంతంలోని ఓ ఆలయం కూడా ఉగ్రవాదుల దాడికి కావొచ్చని సూచించింది. పాకిస్తాన్ ప్రోత్సహిత లష్కరే తొయిబా ఈ దాడులకు దారితీసిందని పక్కా సమాచారం అందినట్లు వివరించింది.
దీంతో భద్రతా ఏజెన్సీలు నిఘా పెంచాయి. ఈ నెల 6వ తేదీన పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఓ మసీదు వద్ద పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 60 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. ఈ నరమేథం వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపిస్తూ వస్తోంది పాకిస్తాన్. భారత్ పన్నిన కుట్రను ఆఫ్ఘనిస్తాన్ అమలు చేసిందని విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా హెచ్చరికలు జారీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇస్లామాబాద్ మసీదుపై చోటు చేసుకున్న దాడికి ప్రతీకారంగా భారత్లో మారణ హోమానికి నిదర్శనాలని లష్కరే తొయిబా ప్రయత్నాలు సాగిస్తోన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో అవకాశం. ఈ దాడుల కోసం ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజెస్ (IED) ను వినియోగించుకోవచ్చు, ఈ మధ్యకాలంలో పెద్ద మొత్తంలో ఆ ఉగ్రవాద సంస్థ ఐడీని సమకూర్చుకుందని అంచనా వేసినట్లు. ఢిల్లీతో పాటు భారత్లో ఓ భారీ ఉగ్రదాడికి ప్రణాళిక వేస్తున్నట్లు, ప్రధాన దేవాలయాలను లక్ష్యంగా చేసుకోవచ్చని.
ఈ సమాచారం అందిన వెంటనే, ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా ఏజెన్సీలు ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. సమస్యాత్మక, అత్యంత సున్నితమైన ప్రాంతాల నిఘాను ముమ్మరం చేశాయి. ప్రత్యేకించి పాత ఢిల్లీలోని పలు ప్రాంతాలపై డేగను వేశాయి. అదనపు బలగాలను మోహరింపజేశాయి. వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేశాయి. మతపర సంస్థలు, ప్రార్థన స్థలాలు, పర్యాటక ప్రాంతాల వద్ద ఆంటీ-సాబోటేజ్ తనిఖీలను పోలీసులు నిర్వహించారు.
గత ఏడాది నవంబర్ 10వ తేదీన ఎర్రకోట వద్ద ఒక తెల్లటి హ్యుందాయ్ ఐ20 కారు పేలుడు సంభవించిన ఘటనలో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. కాశ్మీర్కు చెందిన వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఉమర్ నబీ ఈ ఘాతుకానికి హాజరయ్యారు. ఈ వాహనాన్ని అతను స్వయంగా నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఢిల్లీ ఎర్రకోట పరిసరాల్లో 24 గంటల గస్తీ, నిఘాతో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు.
ఆంగ్ల సారాంశం
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఇంటెలిజెన్స్ హెచ్చరికను అందుకుంది దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడి హెచ్చరించింది, ఎల్ఇటి పరిశీలనలో