seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 8:32 am Digital Edition : SEEMA KIRANAM

దివ్వెల మాధురికి కలిసి తిరుమలరాలేదబ్బా.. ఫోటోషూట్ కేసు విచారణకు వెళ్తే ఇంకో కేసు! | 2024 ఫోటోషూట్ కేసులో తిరుపతి కోర్టుకు హాజరైన దివ్వెల మాధురి, ఇప్పుడు పుట్టినరోజు వేడుకలపై మరో కేసు

ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట పేరు వివాదాలకు. కేరాఫ్. ముఖ్యంగా ఈ జంట తిరుమలలో ఇప్పటికి రెండు వివాదాలలో చిక్కుకున్నారు. 2024లో రీల్స్, ఫోటోషూట్‌ల కేసు ఇంకా విచారణలో ఉండగానే, తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు వేడుకలను కొండపై నిర్వహించి ఈ జంట మరో తలనొప్పి తెచ్చుకున్నారు. ఈ వరుస సంఘటనలు వారికి అనవసరమైన చిరాకులను తెచ్చి పెడతాయి. న్యాయపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

తిరుమల ఫోటోషూట్ కేసులో కోర్టుకు దివ్వెల మాధురి

తాజాగా ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకుని, నేడు 2024లో తిరుమలలో ఫోటో షూట్‌లు, రీల్స్ చేసిన కేసులో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు శ్రీవారి దర్శనం కోసం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, తనూజ మొన్న బుధవారం నాడు తిరుమలకు చేరుకున్నారు. అదే రోజు రాత్రి, మాధురి, తనూజలు తిరుమలలోని ఓ గెస్ట్‌హౌస్‌లో తనూజ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

2024 ఫోటోషూట్ కేసులో తిరుపతి కోర్టుకు హాజరైన దివ్వెల మాధురి ఇప్పుడు పుట్టినరోజు వేడుకలపై మరో కేసు

తనూజ పుట్టినరోజు కేక్ కట్ చేసిన వివాదం

ఆ తర్వాత దివ్వెల మాధురి ఆ వేడుకల వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది టీటీడీ నిబంధనలకు విరుద్ధమని, తిరుమల కొండపై కేక్ కట్ చేయటం నిషేధమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై టీటీడీ అధికారులు సీరియస్‌గా స్పందించారు. తిరుమల కొండపై బర్త్ డే వేడుకలు నిర్వహించడం వల్ల ఉల్లంఘించడమేనన్నారు.

మరో కేసులో ఇరుక్కున్న దివ్వెల మాధురి

వారిద్దరిపై నిఘా చర్యలు తీసుకోవాలని కోరుతూ టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు. గతంలో 2024లో తిరుమలలో ఫోటోషూట్‌లు, రీల్స్ చేసిన కేసులో విచారణ నిమిత్తం హాజరు కావటానికి వచ్చిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఇప్పుడు మళ్ళీ మరో కేసులో చిక్కుకున్నారు.

కోర్టులో కేసు విచారణకు హాజరైన దివ్వెల మాధురి

ఇక నేడు 2024లో ఫొటో షూట్‌లు, రీల్స్ చేసిన కేసులో ఆమె , దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి కోటేశ్వరరావు. తిరుమల వన్ టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను కోర్టు దివ్వెల మధుకి అందజేసింది. మే 12న ఇద్దరు జమీనుదారులతో పాటు జామీను పత్రాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

తిరుమల కలిసిరాలేదన్న అభిప్రాయం

మాధురి న్యాయవాది ఇరుగు రమేష్ కోర్టులో వాదనలను వినిపిస్తున్నారు. ఒక కేసు విచారణలో ఉండగానే, పుట్టినరోజు వేడుకల ఘటనలో మరో కేసు నమోదయ్యే అవకాశం లేకపోవడంతో, దివ్వెల మాధురి న్యాయపరమైన సవాళ్లపై అందరిలో చర్చ జరుగుతుంది. అదనపు కేసుల నమోదు జరిగితే పరిస్థితి ఏంటన్న ఆసక్తి. తిరుమల అచ్చి రాలేదన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతుంది.

ఆంగ్ల సారాంశం

ఫోటో షూట్‌లు, రీళ్లకు సంబంధించిన 2024 కేసుకు సంబంధించి దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి దివ్వెల మాధురి తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే మరో కేసు నమోదైనట్లు సమాచారం.

Source link