seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 5:27 am Digital Edition : SEEMA KIRANAM

తెలంగాణ: మున్సిపాల్టీల్లో ఎక్స్ ఆఫీషియో ఓటు వారికే..! తేల్చేసిన ఈసీ..! | అనేక స్థానాల్లో హంగ్ మున్సిపల్ ఎన్నికల మధ్య తెలంగాణ SEC ఎక్స్-అఫీషియో ఓటు అర్హతను స్పష్టం చేసింది

తెలంగాణ

ఓయ్-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలంగాణలో ఉత్కంఠభరితంగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు (తెలంగాణ మునిసిపల్ ఎలిషన్ ఫలితాలు) వెలువడ్డాయి. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 74 మున్సిపాలిటీలతో పాటు 3 కార్పోరేషన్లలో విజయం సాధించింది. బీఆర్ఎస్ 17 చోట్ల గెలిచింది. మరో 24 చోట్ల ఎవరికీ మెజార్టీ రాక హంగ్ ఏర్పడింది. దీంతో ఆయా స్థానిక సంస్థలను దక్కించుకోవాలంటే అధికార, విపక్షాలకు ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఈసారి ఈసారి మున్సిపల్ పీఠాల పోరులో ఎక్స్ అఫీషియో సభ్యులెవరో ఎస్ఈసీ క్లారిటీ ఇచ్చింది.

తెలంగాణ మున్సిపాలిటీలో చట్టం-2019 ప్రకారం ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు ఎవరికి ఉంటుందో విజ్ఞత ఎస్ఈసీ రాణికుముదిని ఓ ప్రకటన చేశారు. ఇందులో రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ఎక్స్‌అఫీషియో సభ్యులకు ఓటు హక్కు తప్పనిసరి అని తెలిపారు. అలాగే ఆయన మున్సిపాలిటీలు, లేదా కార్పోరేషన్ పరిధిలో ఓటరుగా నమోదు కానివారు వేసేందుకు అనర్హులని ఆమె పేర్కొన్నారు.

హంగ్ మున్సిపల్ ఎన్నికల మధ్య తెలంగాణ SEC ఎక్స్-అఫీషియో ఓటు అర్హతను స్పష్టం చేసింది

ఎమ్మెల్యేలు, లోక్ సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో ఏదో ఒక మున్సిపాలిటీలు ఎక్స్ అఫీషియా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎస్ఈసీ తెలిపారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు తమకు ఓటు హక్కు ఉన్న చోట మాత్రమే ఎక్స్ అఫీషియో ఓటు వేయాల్సి ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు తమ ఎక్స్ అఫీషియో ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఇవాళ్టి వరకూ ఎస్ఈసీ అనుమతినిచ్చింది. దీంతో వారంతా ఎక్స్ అఫీషియో ఓటు హక్కు నమోదుకు బయలుదేరుతున్నారు.

Source link