seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 2:02 am Digital Edition : SEEMA KIRANAM

తెలంగాణ ఫార్ములా ఈ- రేస్ కేసులో అనూహ్య పరిణామం | కేంద్రం అనుమతి తర్వాత ఫార్ములా-ఇ కేసులో తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోనున్నారు.

తెలంగాణ

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై విచారణకు అనుమతి కోరుతూ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT)కు ఈ లేఖను పంపించారు. ఈ కేసులో అరవింద్ కుమార్ ఏ2గా ఉన్నారు. ఈ కేసులో విచారణ చేపట్టడానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇదివరకే అనుమతి కూడా ఇచ్చారు.

అరవింద్ కుమార్ పై విచారణ జరపడానికి తాజాగా అనుమతి లభించింది. దీనికి అవసరమైన అనుమతులను డీఓపీటీ ప్రదర్శించడం. ఈ కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అరవింద్ కుమార్‌ ప్రాసిక్యూషన్‌కు కూడా అనుమతి రావడంతో చార్జిషీట్‌ను దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది.

కేంద్రం అనుమతి తర్వాత ఫార్ములా-ఇ కేసులో తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోనున్నారు

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేసులో సుమారు 55 కోట్ల రూపాయల అనధికారిక చెల్లింపులకు సంబంధించిన కేసు ఇది. ఈ చెల్లింపుల కేసులో అరవింద్ కుమార్ పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2024 జనవరిలో అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు మెమో జారీ కూడా అయింది. ఫార్ములా ఈకి అనుమతి లేని నిధులు, వాటికి అధికారికంగా ఎటువంటి ఆమోదాలు లేవు, కంపెనీకి నిధులు చెల్లించడంపై వివరణ కోరింది కాంగ్రెస్ ప్రభుత్వం.

2024 జనవరి 6న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ మెమో జారీ చేశారు. సచివాలయంలో శాఖల ఆమోదం, అర్హత గల అధికారి అనుమతి లేకుండా నిర్ణయాలు, చెల్లింపులెందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సమయంలో సీజన్-10 ఫార్ములా ఈకి సవరించిన ఒప్పందం కుదుర్చుకోవడంపై కూడా లేఖలో స్పష్టత ఉంటుంది. అప్పట్లో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిధుల నుండి ఫార్ములా ఈకి రూ. 46 కోట్లు, పన్ను మరో తొమ్మిది కోట్ల రూపాయలను చెల్లించారు.

దీనికి కుదిరిన ఒప్పందంపై సంతకాలు చేయడానికి ముందే హెచ్‌ఎండీఏ బోర్డు.. అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతినే’ ఈ మొత్తం చెల్లించినట్లు మెమోలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 299 ప్రకారం, కేంద్ర/రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించి చేసే ఒప్పందాలు రాష్ట్రపతి లేదా గవర్నర్ ద్వారా జరగాలి. మెమోపై అరవింద్ కుమార్ స్పందించారు. అప్పటి మునిసిపల్ మంత్రి కేటీఆర్‌ను పాటించానని వివరించారు.

దీని తర్వాత కేటీఆర్, అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు తాజాగా అరవింద్ కుమార్ పై విచారణకు అనుమతి కోరుతూ డీఓపీటీకి లేఖ రాశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. డీఓపీటీ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఏసీబీ రంగంలోకి దిగే అవకాశం ఉంది.

ఆంగ్ల సారాంశం

కేంద్రం అనుమతి తర్వాత ఫార్ములా-ఇ కేసులో తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోనున్నారు.

Source link