తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
పర్యావరణ హితమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆర్టీసీకి 1,085 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనుంది ఒలెక్ట్రా సంస్థ. పీఎం ఈ-డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఈ-బస్సుల సరఫరా జరగనుంది. ఈ మేరకు బస్సుల సరఫరాకు లెటర్ ఆఫ్ ఇండెంట్ ను ఆర్టీసీ జారీ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణఆర్టీసీకి ఓలెక్ట్రా 12 మీటర్ల పొడవు ఉన్న ఫ్లోర్ బస్సులను సరఫరా చేస్తుంది. ఇందులో ఏసీ, నాన్-ఏసీ బస్సులున్నాయి.
తెలంగాణ ఆర్టీసీకి గుడ్ న్యూస్ అందింది. త్వరలో తెలంగాణ ఆర్టీసీ 1085 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. ఈ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (OGL) సంస్థ సరఫరా చేయనుంది. ఈ మేరకు ఒలెక్ట్రా సంస్థకు తెలంగాణ ఆర్టీసీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకంలో భాగంగా పర్యావరణ అనుకూల ఇంధన, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (CESL) ఆధ్వర్యంలో ఈ లేఖను జారీ చేసింది.

ఇక స్థానిక రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా బస్సులను రూపొందించింది ఒలెక్ట్రా సంస్థ. బస్సు ముందు, వెనుక భాగంలో ఆధునిక ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు అధికారులు. దాంతో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 250 మందికి పైగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అతి తక్కువ సమయంలో అంటే సుమారు 45 నిమిషాల్లోనే ఛార్జింగ్ ఈ బస్సులో ఉంది. దేశవ్యాప్తంగా 3,600 కు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది ఓలెక్ట్రా సంస్థ. అలాగే ప్రస్తుతం 10 వేల విద్యుత్ వాహనాలను ఆర్డర్ చేసింది ఆ సంస్థ.

