తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కొత్త హెల్త్ పాలసీ!
తెలంగాణ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త హెల్త్ పాలసీ అమల్లోకి రానుంది. దీంతో ఎంప్యానెల్డ్ హాస్పిటల్స్లో పరిమితి లేని వైద్య సదుపాయాలు అందుతాయి. ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ పేలో 1.5%, ప్రభుత్వ 1.5% కలిపి మొత్తం 3%(ఏటా సుమారు రూ.1000 కోట్లు) కేటాయించనుంది. పథకం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు, మోడల్ స్కూల్స్, గురుకులాల సిబ్బందినీ ఇందులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. దీనికోసం త్వరలో కమిటీని ఏర్పాటు చేయనునట్లు తెలుస్తోంది.