seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 12:33 am Digital Edition : SEEMA KIRANAM

తిరుమల వెళ్లే భక్తులకు గమనిక | మార్చి 17న తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల ప్రదర్శన. మంగళవారం నాడు 73,572 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,747 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.38 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 29 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది.

ఈ నెల 19వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది పండగ. శ్రీ పరాభవ నామ ఉగాది పండగను అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదే రోజున వేలాదిమంది భక్తుల సమక్షంలో శ్రీవారి ఆలయ ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాది పండగను అత్యంత వైభవంగా ఏర్పాటు చేసేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరుగుతుంది.

మార్చి 17న తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.

ఉగాది రోజున ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా మలయప్పస్వామివారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. అనంతరం శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. ఆ తరువాత పంచాగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. టీటీడీ ఆగమ పండితులు, అర్చకులు శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహించారు.

ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఈ నెల 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఆ రోజున తెల్లవారు జామున 6 గంటలకు శుద్ధి కార్యక్రమం ఆరంభమౌతుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు, కార్యనిర్వాహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి ఇందులో పాల్గొంటారు.

ఈ సందర్భంగా ఆనందనిలయం, ధ్వజస్తంభం, బంగారువాకిలి, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, విమాన వేంకటేశ్వరుడు, పూజసామగ్రి.. ఇలా అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. ఆ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు.

దీని తర్వాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. సంవత్సరంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం నిర్వహించడం అనాదిగా వస్తోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 16వ తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించారు. అదేవిధంగా మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ఈ కారణంగా మార్చి 18వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించారు.

ఆంగ్ల సారాంశం

మార్చి 19న జరగనున్న ఉగాది ఆస్థానానికి సంబంధించి మార్చి 17వ తేదీ మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.

Source link