seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 3:24 am Digital Edition : SEEMA KIRANAM

తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం | దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో సీఎం చంద్రబాబు, నారా లోకేష్, కుటుంబ సభ్యులు ప్రార్థనలు చేశారు

[ad_1]

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

నేడు- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూ లైన్ గుండా స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఈ తెల్లవారు జామున స్వామివారి సేవలో పూర్తి. అనంతరం భక్తులతో కలిసి శ్రీవేంగమాంబ అన్నదాన వితరణ జిల్లా శ్రీవారి అన్నప్రసాదాలను స్వీకరించారు.

శ్రీవారి దర్శనార్థం శుక్రవారం సాయంత్రమే చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ తిరుమలకు చేరుకున్నారు. రాత్రి గాయత్రి నిలయంలో బస చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఆయనకు స్వాగతం పలికారు. పుష్ప గుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, నరేష్, జంగా కృష్ణమూర్తి, జానకిదేవి చంద్రబాబు కుటుంబానికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో సీఎం చంద్రబాబు నారా లోకేష్, కుటుంబ సభ్యులు ప్రార్థనలు చేశారు

ఈ తెల్లవారు జామున చంద్రబాబు కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో ఉన్నప్పటికీ. క్యూ లైన్ గుండా దర్శనానికి వెళ్లారాయన. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకులవారి మండపంలో టీటీడీ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలను పలికారు. తీర్థప్రసాదాలను. స్వామివారి శేషవస్త్రాలను బహుకరించారు.

దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒకరోజు భోజనానికి అయ్యే ఖర్చు మొత్తం 44 లక్షల రూపాయలను టీటీడీ అన్నప్రసాద కేంద్రానికి చంద్రబాబు. నంతరం మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ భక్తులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా భక్తులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో మనవడితో చంద్రబ బాబు చాలా సేపు మాట్లాడటం కనిపించింది. ఆయన వెంట బీఆర్ నాయుడు, ముద్దాడ రవిచంద్ర, వెంకయ్య చౌదరి, సీవీఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికారులు ఉన్నారు.

[ad_2]

Source link