seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 11:19 am Digital Edition : SEEMA KIRANAM

తారకరత్న భార్య అలేఖ్య పొలిటికల్ ఎంట్రీ..!? | అలేఖ్య రెడ్డి రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని సన్నిహితులతో తాజా చర్చలు, అధికారికంగా ప్రకటించడం

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తారకరత్న సతీమణి అలేఖ్య పొలిటికల్ ఎంట్రీ. తాజా ఇంటర్వ్యూలో అలేఖ్య చేసిన పొలిటికల్ కామెంట్స్ తో రాజకీయ అడుగుల పైన ఆసక్తికర చర్చ మొదలైంది. తన కుటుంబ రాజకీయ నేపథ్యం గురించి వివరిస్తూ.. ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. అయితే.. రాజకీయంగా ఏ పార్టీ నుంచి ఎంట్రీ ఇవ్వాలనే అంశం పైనా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అటు టీడీపీ.. ఇటు వైసీపీలో పని చేసిన వారితో సన్నిహిత సంబంధాలు ఉన్న వేళ అలేఖ నిర్ణయం ఆసక్తిని మరింత పెంచుతోంది.

నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. తారకరత్న మరణం మరణం కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉంటూ తారకరత్న గురించి, తన పిల్లల గురించి పోస్టులు చేస్తూ వచ్చారు. రాజకీయంగా తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమయ్యాయి. అలేఖ్య తన కుటుంబం.. తారక రత్న ఫ్యామిలీ రాజకీయంగా కీలక పదవుల్లో ఉన్నవారే గుర్తు చేసారు. తన తాతయ్య కాంగ్రెస్ లో పని చేసారని.. వైఎస్సార్ కు సన్నిహిత వ్యక్తిగా చెప్పుకొచ్చారు. టీడీపీ నుంచి తన మామయ్య పోటీ చేసారని వివరించారు. విజయ్ సాయి రెడ్డి బాబాయ్, పిన్ని వాళ్ళతోనే తాను ఎక్కువగా పెరిగానని వివరించారు. వారిద్దరూ తనకు బాగా క్లోజ్ అని చెప్పారు. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా పాలిటిక్స్ లో ఉండటంతో వాళ్ళెవరూ ఫ్యామిలీకి టైం ఇచ్చేవాళ్ళు కాదని… అందుకే తారక్ పాలిటిక్స్ లోకి వెళ్తాను అంటే నేను వద్దన్నానని వివరిం చారు.

alekhya-reddy-all-set-to-entre-rent-politics-as-latest-scussions-to-sellow-associates-to-to-announce-

అలేఖ్య రెడ్డి రాజకీయ ప్రవేశం పై చర్చ

అయితే, తనకు రాజకీయాల పైన ఇప్పటి వరకు ఆసక్తి లేదని చెబుతూనే.. భవిష్యత్ లో రావాలని అనుకుంటే వస్తానమో అని తన మనసులో మాట బయటపెట్టారు. మనం అనుకున్నది జరుగు తుందో.. జరగదో అంటూ వ్యాఖ్యానించటం ద్వారా మరింత చర్చకు ఆస్కారం ఏర్పడింది. కాగా.. అసలు అలేఖ్య రాజకీయంగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఏ పార్టీ నుంచి వస్తారనేది ఇప్పుడు ఈ చర్చలో ప్రధాన అంశంగా మారుతోంది. విజయ సాయిరెడ్డి ప్రస్తుతం వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు. అటు నందమూరి బాలయ్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఇద్దరే తారకరత్న మరణం నుంచి అలేఖ్య కుటుంబానికి అండగా ఉంటున్నారు. అయితే, అసలు తెలంగాణ – ఏపీలో ఎక్కడ రాజకీయంగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది మరో కీలక అంశం. ‘నేను రాజకీయ కుటుంబం నుంచే వచ్చాను… కనుక రాజకీయాలలోకి వస్తానేమో?” అంటూ వ్యాఖ్యానించిన అలేఖ్యరెడ్డి ఏ పార్టీ అని ఇంకా అనుకోలేదని చెప్పడమే సందేహాలకు తెరలేపుతోంది. అయితే.. రాజకీయంగా అలేఖ్య ఇప్పటికే ఒక స్పష్టతతో ఉన్నట్లు.

ఆంగ్ల సారాంశం

అలేఖ్యా రెడ్డి రాజకీయాల్లోకి రానున్నట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు, త్వరలో చేరిక పార్టీని ప్రకటించనున్నారు

Source link