seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 4:13 pm Digital Edition : SEEMA KIRANAM

డ్రగ్స్ ఎంపీ పుట్టా మహేష్ పై కాంగ్రెస్ ట్వీట్- మోడీకి లింక్ చేస్తూ..! | టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్ కేసును ప్రధాని మోదీతో లింక్ చేసేందుకు కాంగ్రెస్ ట్వీట్ చేసింది

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

హైదరాబాద్ శివారు మెయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ పెట్టి పాజిటివ్ గా తేలిన ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ (putta Mahesh Yadav)పై విమర్శల జడి వాన కురుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో విపక్ష వైసీపీ ఆయన్ను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తోంది. దీంతో సొంత పార్టీ టీడీపీ కూడా చేతులెత్తేసింది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరడంతో పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ (కాంగ్రెస్) కూడా ఆయనపై స్పందించింది.

ఎక్స్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ వ్యవహారంపై ట్వీట్ చేసింది. ఇందులో ఆయన ప్రధాన మంత్రి మోడీతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. ఈయన నరేంద్ర మోడీ కూటమిలోని పార్లమెంటు సభ్యుడు పుట్టా మహేష్ కుమార్,
హైదరాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు, అతని రక్త పరీక్షలో మెత్ కనిపించిందని. పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేసినప్పుడు, పుట్టా మహేష్ కుమార్ సహచరులు కాల్పులు జరిపారని, ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ నిండినట్లు కనిపించిందని తెలిపారు.

టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్ కేసును ప్రధాని మోదీతో లింక్ చేసేందుకు కాంగ్రెస్ ట్వీట్ చేసింది

నివేదికల ప్రకారం, పుట్టా మహేష్ కుమార్ పూర్తిగా తాగి పోలీసు అధికారులపై భాషాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ లో ఆరోపించింది. ఇది నరేంద్ర మోడీ సభ్యుల స్వభావం, ప్రవర్తన, ముఖం అంటూ విమర్శలు ఎక్కుపెట్టింది.
నరేంద్ర మోడీ తనను తాను ఒకదాని తర్వాత ఒకటిగా జలగ లాంటి వ్యక్తులతో చుట్టుముట్టారని, ఒకరు డ్రగ్స్, మరొకరు అత్యాచారం చేస్తారు, అది వారి సామర్థ్యం అని విమర్శించింది. దీని కారణంగా వారికి పదోన్నతులు లభిస్తాయని.
సిగ్గుచేటు అంటూ ట్వీట్ ను ముగించింది.

Source link