భారతదేశం
ఓయ్-సయ్యద్ అహ్మద్
<!--
--> <!-- -->ఇరాన్ పై ఏకపక్షంగా దాడులు మొదలయ్యాయి..ఆ తర్వాత ఎదురవుతున్న అనుభవాలతో ఇవాళ యుద్దానికి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (డోనాల్డ్ ట్రంప్) చేసిన ప్రకటన ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. ట్రంప్ ప్రకటనపై పలు దేశాలు కనిపిస్తున్నాయి. అమెరికా మిత్రదేశాలు ఈ ప్రకటనను స్వాగతించాయి. అలాగే భారత్ కూడా ఇరాన్ యుద్ధం ఆపాలన్న ట్రంప్ నిర్ణయంపై స్పందించింది.
ఇరాన్ యుద్దం విషయంలో ట్రంప్ ఇవాళ చేసిన ప్రకటనపై భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ స్పందించారు. ఇవాళ విదేశాంగశాఖ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై తలపెట్టిన సైనిక దాడులను రోజులు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో, భారత్ పరిణామాలు ఐదు నిశితంగా గమనించినట్లు పేర్కొంది. అయితే అంతకు మించి సిఫార్సు మాట్లాడలేదు.

#చూడండి | ఢిల్లీ: ఇరాన్ పవర్ ప్లాంట్లు మరియు ఇంధన మౌలిక సదుపాయాలపై సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్పై, MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్, “అవును, మేము చేస్తున్నట్లే ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాము…” అని అన్నారు. https://t.co/PIfJqQrIbD pic.twitter.com/T01TZrPr1A
– ANI (@ANI) మార్చి 23, 2026
మరోవైపు మధ్యాహ్నం పశ్చిమాసియా ఉద్రిక్తతలపై లోక్ సభలో మాట్లాడిన ప్రధాని మోడీ. చర్చ జరుగుతుండగానే ట్రంప్ ప్రకటన వెలువడింది. దీంతో భారత్ కూ భారీ ఊరట లభించినట్లయింది. ఎందుకంటే ఇప్పటికే హార్ముజ్ జలసంధిలో ఆటంకాల నేపథ్యంలో చమురు నౌకలు భారత్ కు రావడం ఆలస్యమవుతోంది. ఇతర దేశాల తరహాలో ఆంక్షలు లేకపోయినా ట్రాఫిక్, ఇతర సమస్యలతో నౌకలు ఆలస్యంగా దేశంలో చమురు, గ్యాస్ కొరత కారణంగా ఉంది.