ట్యాంపర్ చేస్తే నేరుగా జైలుకే పంపిస్తాం : చంద్రబాబు
కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 06, (సీమకిరణం న్యూస్):
మీ భూమిపై ఎవరూ కన్నేయకుండా సర్వహక్కులు కల్పించామని సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలు జిల్లా కలుగొట్లలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘గతంలో భూ సమస్యల ఫిర్యాదులు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. ఇప్పుడు మీభూమిని ఎవరి పేరుతోనైనా మారిస్తే వెంటనే తెలుస్తుంది. క్యూఆర్ కోడ్ వల్ల మీ ఫోన్లోనే మీరు చూసుకోవచ్చు. మీ రికార్డులన్నీ కంప్యూటర్లో భద్రం. ట్యాంపర్ చేస్తే నేరుగా జైలుకే.. వదిలిపెట్టేది లేదు’’ అని చంద్రబాబు స్పష్టంచేశారు.

