అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలోని పరంద్ ప్రాంతంలో దట్టమైన పొగ కనిపించింది. దాంతో అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఏదైనా పేలుడు సంభవించి ఉండొచ్చని సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. క్షిపణులు లేదా డ్రోన్ దాడి వల్ల ఈ పేలుడు సంభవించిందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇరానియన్ స్టేట్ బ్రాడ్ కాస్టర్ IRIB ఈ వార్తలను కొట్టిపారేసింది.
పరంద్ ప్రాంతంలోని పొదల్లో జరిగిన చిన్న అగ్నిప్రమాదం కారణంగా దట్టమైన పొగ.. ఆ ప్రాంతంలోని భవనాలను అలుముకుందని IRIB. అలాగే పరంద్ లో ఎలాంటి పేలుడు జరగలేదని స్థానిక అధికారులు సైతం స్పష్టం చేశారు. ఈ సీజన్లో పరంద్ ప్రాంతంలో ఇలాంటి కార్చిచ్చులు సహజంగానే జరుగుతాయని చెప్పారు.
ఇక జెనీవా వేదికగా అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన అణు చర్చలు జరిగాయి. ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇరాన్ కొన్ని గంటల పాటు హార్మోజ్ జలసంధిని మూసి వేసింది. ఆ ప్రాంతంలో ఇరాన్ సైనిక చర్యలు చేపట్టారు. లైవ్ క్షిపణులను ప్రయోగించింది. అదే ప్రాంతంలో అమెరికా కూడా సైన్యాన్ని మోహరిస్తోంది. దాంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తమైన వాతావరణం.
భారీ పేలుడు ఇరాన్ మిలిటరీ వేర్హౌస్లను తాకింది #బ్రేకింగ్ న్యూస్ #ఇరాన్ #టెహ్రాన్ #పేలుడు #సైనిక #భౌగోళిక రాజకీయాలు #ప్రపంచ వార్తలు #రక్షణ వార్తలు #సంఘర్షణ #న్యూస్ అప్డేట్ pic.twitter.com/z01W8S7UuC
— డిఫెన్స్ మీడియా (@Defencemedia0) ఫిబ్రవరి 18, 2026
టెహ్రాన్ శివార్లలో అమెరికా సైనికుల కోసం ఐదు వేల సమాధులను సిద్ధం చేశారు
టెహ్రాన్లోని అతిపెద్ద శ్మశానవాటిక అయిన బెహెష్తే జహ్రా యొక్క CEO, US సైనికులను ముస్లిం స్మశానవాటికలో ఖననం చేయలేనందున ప్రత్యేక స్థలం అవసరమని చెప్పారు. pic.twitter.com/7tClBnSF9m
— టెహ్రాన్ టైమ్స్ (@TehranTimes79) ఫిబ్రవరి 18, 2026
ఈ నేపథ్యంలోనే టెహ్రాన్ లోని పరంద్ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాప్తి చెందడంతో ఇది ఇరాన్ పై అమెరికా సైన్యం దాడిగా నెట్టింట వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు ఇరాన్ మీడియా, స్థానిక అధికారులు కొట్టిపారేశారు. అయినా సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే తప్పుడు వ్యాప్తి చెందితే వారిపై చర్యలు తీసుకుంటామని పరంద్ ప్రాసిక్యూటర్ తాజాగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే అమెరికా సైనికుల మృతదేహాలను పూడ్చేందుకు ఐదు వేల సమాధులను ఇరాన్ సిద్ధం చేస్తుంది. టెహ్రాన్ శివారులో కాంక్రీట్ తో సెపరేట్ ఆవరణ ఏర్పాటు చేయాల్సిన సమాచారం. ఇదే విషయంపై టెహ్రాన్ లోని అతి పెద్ద శ్మశాన వాటిక అయిన బెహెస్తే జహ్రా సీఈఓ మాట్లాడుతూ.. అమెరికా సైనికులను ముస్లి శ్మశాన వాటికలో పూడ్చలేం కాబట్టి సెపరేట్ గా 5 వేల సమాధులు కట్టినట్లు తెలిపారు.