Wednesday, March 4, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణజైలు నుంచి అంబటి రాంబాబు విడుదల..!! | సత్తెనపల్లి లాటరీ కేసులో కోర్టు బెయిల్ మంజూరు...

జైలు నుంచి అంబటి రాంబాబు విడుదల..!! | సత్తెనపల్లి లాటరీ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు విడుదలయ్యారు.

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

వైసీపీ ముఖ్య నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యారు. వరుస కేసుల్లో ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలతో అరెస్ట్ అయిన అంబటి పైన గతంలో నమోదు అయిన కేసులోనూ అరెస్ట్ చేసారు. కాగా, జనసేన నేత నమోదు చేసిన కేసులో ఈ రోజు అంబటికి బెయిల్ వచ్చింది.దీంతో, జైలు నుంచి బయటకు వచ్చిన అంబటి రాంబాబు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిందని.

వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యారు. చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు పైన కేసు నమోదు అయింది. ఈ కేసులో ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా.. ఈ కేసులో కొద్ది రోజుల క్రితం రాంబాబుకు బెయిల్ లభించింది. కాగా, అదే సమయంలో మెడికల్ కాలేజీల పీపీ విధానానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన సమయంలో పోలీసులతో దురుసుగా వ్యవహరించడం.. అధికారులకు అడ్డంకి ఏర్పడిందనే కేసు తెరపైకి వచ్చింది. విచారణ తరువాత ఆ కేసులోనూ అంబటికి బెయిల్ వచ్చింది. ఆ వెంటనే జనసేన జిల్లా అధ్యక్షుడు అంబటి మంత్రిగా ఉన్న సమయంలో సత్తెనపల్లిలో లక్కీ డ్రా పేరుతో మోసం చేసారనే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా రిమాండ్ విధించారు. దీంతో, ఈ రోజు వరకు అంబటి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజు ఈ కేసులోనూ బెయిల్ లభించింది.

సత్తెనపల్లి లాటరీ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు విడుదలయ్యారు.

ప్రభుత్వం అడ్డుకొనే ప్రయత్నం చేసిందంటూ

దీంతో, అంబటి జైలు నుంచి బయటకు వచ్చారు. తనను బయటకు రానీయకుండా ప్రభుత్వం లోని కొందరు ముఖ్యులు కుట్రలు చేసారని అంబటి వారిని. తనను అడ్డుకోవాలని చూసారని చెప్పుకొచ్చారు. ఎన్ని రోజులైనా జైలులో ఉండాలనే నిర్ణయంతో లోపలకు వెళ్లాలని సూచించింది. అన్నీ చూస్తున్నాడని.. ఫలితం అనుభవించాల్సిదేనని దేవుడున్నాడు. అంబటి రాంబాబు దాదాపు ఇరవై రోజుల పాటు జైలు జీవితం అనుభవించారు. ఆయన గతంలో కూడా కేసులను ఎదుర్కొన్నా ఎప్పుడూ జలుకు వెళ్ళలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా, అంబటి నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇది తొలి జైలు. అయితే మూడు కేసుల వల్లన ఆయన మూడు వారాల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. మాజీ ఎంపీ ఉండవల్లి సహా.. పలువురు వైసీపీ నేతలు జైలులో అంబటిని పరామర్శించారు. ఇక.. జైలు నుంచి విడుదలైన అంబటి రాంబాబు రేపు (గురువారం) మాజీ సీఎం జగన్ ను కలవడానికి సంబంధించిన సమాచారం.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular