Monday, March 2, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణజగన్ బిగ్ మిస్టేక్ - గోల్డెన్ ఛాన్స్ మిస్..!! | లడ్డూ చర్చల మధ్య వైఎస్...

జగన్ బిగ్ మిస్టేక్ – గోల్డెన్ ఛాన్స్ మిస్..!! | లడ్డూ చర్చల మధ్య వైఎస్ జగన్ అసెంబ్లీకి గైర్హాజరు కావడంపై సొంత పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లడ్డూ వ్యవహారం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. రాజకీయంగా వివాదం మారింది. – కూటమి మధ్య లడ్డూ వివాదం పైన కొద్ది రోజులుగా డైలాగ్ వార్ వైసీపీ కొనసాగుతోంది. మండలిలోనూ వైసీపీ సభ్యులు ఇందాపూర్ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ వేదికగా లడ్డూ వివాదంపై ప్రభుత్వం చర్చ ప్రారంభించింది. అయితే.. మాజీ సీఎం జగన్ తాజా నిర్ణయం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త లెక్కలకు కారణంగా మారుతోంది.

లడ్డూ వివాదం ఊహించని మలుపులు తీసుకుంటోంది. జగన్ ప్రభుత్వంలో తిరమలలో లడ్డూ కల్తీ ప్రకటించారు సీఎం చంద్రబాబు సహా కూటమి నేతలు. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు సూచనల మేరకు సిట్ విచారణ చేసింది. కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో అనేక అంశాలను ప్రస్తావన చేసింది. వైసీపీ.. జగన్ లక్ష్యంగా కూటమి నేతలు ఈ అంశంలో పలు రకాల ఆరోపణలు చేసారు. ఇదే సమయంలో ఇందాపూర్ – హెరిటేజ్ అంశం పైన మండలిలో వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. అసెంబ్లీలో ఈ రోజు.. మండలిలో 26న చర్చకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. నేతలు చేసిన ఆరోపణల పైన మీడియా సమావేశంలో జగన్ కూటమి స్పష్టత ఇచ్చారు. తిరుమలకు లడ్డూ సరఫరా, బోలే బాబా డైరీ నుంచి వచ్చిన నెయ్యి.. ఇందాపూర్ వ్యవహారంతో పాటుగా వైఎస్సార్ హయాంలో తిరుమల కొండల పైన ఇచ్చిన జీవోలను బయట పెట్టారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో తన ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలను తిప్పి కొట్టారు. జగన్ వివరణతో వైసీపీ నేతల్లో జోష్ పెరిగింది.

అసెంబ్లీకి గైర్హాజరుపై వైఎస్ జగన్ నిర్ణయం.. లడ్డూ చర్చల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ గైర్హాజరు పైన భిన్నాభిప్రాయాలు

అయితే, ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో జగన్ హాజరు కాకపోవటం పైన సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సభా వేదికగా అధికారిక రికార్డుల్లో ప్రభుత్వం లడ్డూ పైన చర్చ.. వివరణ ఇస్తోంది. జగన్ ఈ సమయంలో తన వాదన వినిపించాల్సిన అవసరం ఉందని కొందరు నేతలు. జగన్ ఈ సమయం లోనూ హాజరు కాకపోవటం వలన కూటమి నేతల వాదన మాత్రమే ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందనే చర్చ. జగన్ చెప్పాలనుకున్నది ఇప్పటికే వచ్చిందని.. సభకు మాట్లాడే అవకాశం ఉండదనేది మరో వాదన. అయితే, జగన్ సభకు వచ్చి మాట్లాడే అవకాశం లేకుంటే ఆ తరువాత మరోసారి ముందు వివరించే అవకాశం ఉందని కొందరు సీనియర్ మీడియా అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి కీలక చర్చ సమయంలో జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు వెళ్లడం ద్వారా… కొత్త విమర్శలకు అవకాశం ఇవ్వటమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మండలిలో వైసీపీ నేతలు ఇందాపూర్ – హెరిటేజ్ అంశం పైన మాట్లాడతారని అంటున్నారు. అయితే, జగన్ ఈ కీలక చర్చ సమయంలో సభకు రాకపోవటం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారుతోంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular