seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 5:57 am Digital Edition : SEEMA KIRANAM

చెరుకులపాడు గ్రామంలో భక్తిశ్రద్ధలతో ముగిసిన మొహరం వేడుకలు

చెరుకులపాడు గ్రామంలో భక్తిశ్రద్ధలతో ముగిసిన మొహరం వేడుకలు

 

కులమతాలకు అతీతంగా పాల్గొన్న గ్రామ ప్రజలు

 

వెల్దుర్తి, జూన్ 27, (సీమకిరణం న్యూస్):

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామంలో మొహరం వేడుకలు శనివారం భక్తి శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా ముగిశాయి. గ్రామ ప్రజలు కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని మొహరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అనంతరం గ్రామ వీధుల గుండా శోభాయాత్రను వైభవంగా చేపట్టారు. శోభాయాత్రలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని భక్తిని చాటుకున్నారు. వేడుకల సందర్భంగా గ్రామంలో భక్తి, ఐకమత్యం, సోదరభావం వెల్లివిరిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక పెద్దలు, నిర్వాహకులు సమన్వయంతో ఏర్పాట్లు చేసి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. మొహరం వేడుకలను గ్రామ ప్రజలు పరస్పర సౌభ్రాతృత్వానికి ప్రతీకగా, ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది.