seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 5:31 am Digital Edition : SEEMA KIRANAM

చనిపోతావంటూ జోస్యం.. ఉరేసుకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య ! | ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఊహించిన జ్యోతిష్యుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు

భారతదేశం

ఓయ్-కొరివి జయకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

బెంగళూరులో ఓ దుర్ఘటన జరిగింది. ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న 29 ఏళ్ల విద్యాజ్యోతి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన బాగలకుంటే ఎంఈఐ లేఔట్‌లో జరిగింది. కొద్ది రోజుల క్రితమే ప్రేమించిన యువకుడితో వివాహం చేసుకున్న ఆమె జీవితం ఇలా విషాదాంతం కావడం కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

తొమ్మిది రోజుల క్రితమే వివాహం..

కొడగు చేరిన యువకుడితో విద్యాజ్యోతి ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం కేవలం తొమ్మిది రోజులే కావడంతో కుటుంబంలో ఆనంద వాతావరణం. ఇద్దరి భవిష్యత్తు ప్రణాళికలపై చర్చిస్తూ కొత్త జీవితం ప్రారంభమైన సమయంలో ఈ ఘటన జరగడం విషాదకరం. అయితే విద్యాజ్యోతి వర్క్ ఫ్రమ్ హోంలో పనిచేస్తున్న సమయంలో ఒక జ్యోతిష్కుడు ఆమెకు అనర్థ సూచనలను చూపించారు. “త్వరలోనే ప్రమాదం సంభవించవచ్చు” వంటి మాటలు చెప్పి ఆమెను తీవ్రంగా భయపెట్టినట్లు సమాచారం.

ఒక-సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని-ఉరి-ఉరి-వేసుకొని-ఆమె-కమిట్ అయిన-ఒక-జ్యోతిష్యుని-గురించి ఆత్మహత్య-కేసు-

కాకుండా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయవలసి ఉంటుంది, చివరి రోజు తాళిని అమ్మవారికి సమర్పించాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ మాటలను ఆమె చాలా సీరియస్‌గా తీసుకుని ఆచరించినట్లు. తొమ్మిదో రోజు పూజల అనంతరం గదిలోకి వెళ్లిన విద్యాజ్యోతి కొంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా ఆమె స్పందనలేని స్థితిలో కనిపించిందని పోలీసులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

కాగా, విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జ్యోతిష్కుడి పాత్ర, అతను చేసిన వ్యాఖ్యలు, వాటి ప్రభావం వంటి విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనలో మూఢనమ్మకాల ప్రభావం మళ్లీ చర్చకు దారి తీసింది. జ్యోతిష్య సూచనలు లేదా భయపెట్టే వ్యాఖ్యలను నమ్మడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆంగ్ల సారాంశం

బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్న విద్యాజ్యోతి (29) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన నగరంలోని ఎంఈఐ లేఅవుట్‌లో చోటుచేసుకుంది.

Source link