seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 7:59 am Digital Edition : SEEMA KIRANAM

గ్రాట్యుటీ, PF, NPSపై కొత్త కార్మిక చట్టాల ప్రభావం? | 2025లో గ్రాట్యుటీ బూస్ట్ రాబోతోంది: వేతన నియమావళి బెనిఫిట్ గణనలను ఎలా మారుస్తుంది, ఉద్యోగులు తప్పక తెలుసుకోవలసినది ఏమిటి?

వ్యాపారం

ఓయి-లింగారెడ్డి గజ్జల

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

కొత్త లేబర్ కోడ్‌లతో గ్రాట్యుటీ లెక్కించే విధానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వేతన నిర్వచనంలో మార్పులు రావడం వల్ల ఉద్యోగులకు లభించే గ్రాట్యుటీ మొత్తాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మార్పులపై పూర్తి స్పష్టత లేకపోవడం ఉద్యోగుల్లో కొంత గందరగోళం.

ఇప్పటి వరకు శాశ్వత ఉద్యోగులకు ఐదేళ్ల నిరంతర సేవ చేసిన తర్వాత గ్రాట్యుటీ అర్హత ఉండేది. ఫిక్స్‌డ్ టర్మ్ (స్థిరమైన వ్యవధి) ఉద్యోగులకు సాధారణంగా ఈ ప్రయోజనం పరిమితంగానే ఉండేది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులు ఒక సంవత్సరం పూర్తి చేసిన వెంటనే, వారు పని చేసిన కాలానికి అనుగుణంగా (ప్రో-రాటా ప్రాతిపదికన) గ్రాట్యుటీ పొందే అర్హత పొందుతారు. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఖచ్చితంగా ఊరటగా ఉంది. శాశ్వత ఉద్యోగులకు ఐదేళ్ల సేవ నిబంధన మాత్రం యథాతథంగా కొనసాగనుంది.

2025లో గ్రాట్యుటీ బూస్ట్ వస్తోంది

అలవెన్సులు 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే..

కీలక గ్రాట్యుటీ లెక్కింపులో అసలు మార్పు వేతన నిర్వచనంలోనే ఉంది. ప్రస్తుతం గ్రాట్యుటీని ప్రాథమిక వేతనం (బేసిక్), డియర్‌నెస్ అలవెన్స్ (DA) ఆధారంగా లెక్కిస్తున్నారు. కానీ కొత్త కోడ్ ప్రకారం ఉద్యోగం మొత్తం జీతంలో కనీసం 50 శాతం ఉంది ‘వేతనం‘గా పరిగణించాల్సి ఉంటుంది. అలవెన్సులు 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే, ఆ అదనపు ఇంకా వేతనంలో కలపాలి. దీనితో గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ (PF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటి ప్రయోజనాల లెక్కింపు బేస్ పెరగనుంది.

ఉదాహరణకు..

ఒక ఉద్యోగి నెల జీతం రూ.70,000 కాగా అందులో బేసిక్ రూ.30,000, అలవెన్సులు రూ.40,000 ఉంటే, పాత విధానంలో గ్రాట్యుటీ లెక్కింపు రూ.30,000 ఆధారంగా జరుగుతుంది. 10 ఏళ్ల సేవకు సుమారు రూ.1.73 లక్షలు లభించవచ్చు. కానీ కొత్త విధానం ప్రకారం అలవెన్సుల్లో 50 శాతం మించిన అదనపు గ్రాడ్యుయేట్ కూడా వేతనంలో చేర్చడం వల్ల రూ.35,000కు పెరిగింది, అదే 10 ఏళ్లకు సుమారు రూ.2 లక్షలకు పైగా లభించే అవకాశం ఉంటుంది.

వివిధ సీటీసీ స్థాయిల్లో కూడా ఈ ప్రభావం కనిపించనుంది. వార్షిక సీటీసీ రూ.6 లక్షలు ఉన్న ఉద్యోగికి ప్రస్తుతం లభించే గ్రాట్యుటీ సుమారు రూ.14,000 ఉంటే, అది కొత్త విధానంలో రూ.19,000 వరకు పెరగవచ్చు. అలాగే రూ.12 లక్షల సీటీసీకి దాదాపు రూ.28,000 నుంచి రూ.38,000 వరకు, రూ.24 లక్షల సీటీసీకి సుమారు రూ.57,000 నుంచి రూ.75,000 వరకు పెరిగే అవకాశం ఉంది.

శాలరీ విభజనలో మార్పు..

ఈ మార్పులతో కంపెనీలు తమ శాలరీజైన్ చేసే అవకాశం ఉంది. బేసిక్ వేతనం పెరిగితే.. PFNPS, గ్రాట్యుటీ వంటి చెల్లింపుల భారం కూడా పెరుగుతుంది. అందువల్ల సంస్థల శాలరీ డివిజన్ పునర్వ్యవస్థీకరణకు ప్రయత్నించాలని పరిశీలకులు కోరారు.

ఇక ముఖ్యమైన అంశం, ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత సేవ చేసిన కాలానికి మాత్రమే పెరిగిన గ్రాట్యుటీ వర్తిస్తుందా, లేక మొత్తం సేవా కాలానికి వర్తిస్తుందా అన్నది ఇంకా పూర్తిగా స్పష్టత పొందలేదు. కంపెనీ ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అమల్లోకి వస్తే..

మొత్తంగా చూసినప్పుడు, కొత్త కార్మిక కోడ్‌లు అమల్లోకి వస్తే ఉద్యోగులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. అయితే అసలు ఎంతవరకు ఉంటుందో ఉద్యోగి జీత నిర్మాణం, సంస్థ తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వం ఇచ్చే స్పష్టత వంటి లాభం ఉంటుంది. అందువల్ల ఉద్యోగులు తమ వేతన నిర్మాణాన్ని సమీక్షించుకోవడం, గ్రాట్యుటీ లెక్కింపును అర్థం చేసుకోవడం సమయోచితమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఆంగ్ల సారాంశం

నవంబర్ 21, 2025 నుండి, కొత్త లేబర్ కోడ్‌లు 50% వేతన నియమంతో గ్రాట్యుటీ గణనను మారుస్తాయి. ఇది ఉద్యోగులు, PF, NPS మరియు జీతం నిర్మాణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇక్కడ ఉంది

Source link