seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 8:42 am Digital Edition : SEEMA KIRANAM

గ్యాస్ బుక్ చేస్తున్నారా? అయితే ఆగండి | గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ నేరాలు, ఇన్‌స్టంట్ గ్యాస్ బుకింగ్ కోసం నకిలీ యాప్‌లు.. సైబర్ మోసాలతో అప్రమత్తంగా ఉండండి

భారతదేశం

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

అన్ని ఇంధనం కొరత పైన ఆందోళన. దీంతో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతాయని, గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందని ప్రజలలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకు తగ్గట్టుగా గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం, గ్యాస్ బుక్ చేసుకున్న సరైన సమయానికి గ్యాస్ రాకపోవడం, కేంద్రం గ్యాస్ బుకింగ్ గడువు పెంచడం అంటే ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.

కొత్త మోసాలకు తెరతీసిన సైబర్ నేరగాళ్ళు

ప్రజలలో ఉన్న ఈ ఆందోళనను అదునుగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరతీశారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో నయా మోసాలకు తెర తీశారు సైబర్ నేరగాళ్లు. గ్యాస్ బుకింగ్ ఇబ్బందిని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసేవాళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తక్షణమే డెలివరీ చేస్తామంటూ పరిమిత అదనపు సిలిండర్లు ఇస్తామంటూ ఆకర్షణీయమైన ప్రకటనలతో నకిలీ వెబ్‌సైట్ లింకులను పంపుతున్నారు.

గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ నేరాలు, తక్షణ గ్యాస్ బుకింగ్ కోసం నకిలీ యాప్‌లు, సైబర్ మోసాలతో అప్రమత్తంగా ఉండండి

నకిలీ వెబ్‌సైట్ లింకులతో సైబర్ నేరం

hp, indane, bharat gas లోగోలతో కూడిన నకిలీ వెబ్‌సైట్ లింకులను పంపుతున్నారు. స్టాక్ అయిపోయింది వెంటనే ఈ లింక్ ద్వారా ఒక రూపాయి చెల్లించి బుక్ చేసుకోండి అంటూ నమ్మించి, యూజర్లు రూపాయి చెల్లించడానికి ప్రయత్నించగానే వారి బ్యాంకు వివరాలు, యూపీఐ పిన్ లు మోసగాళ్లు దొంగిలించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.

అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్‌లను మాత్రమే వాడాలి

సైబర్ క్రైమ్ పోలీసులు గ్యాస్ బుకింగ్ కోసం కేవలం అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్‌లను మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. గుర్తుతెలియని లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని అంటున్నారు. డబ్బులు ఇవ్వడానికి లేదా బుక్ చేయడానికి యూపీ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు.ఎవరైనా పిన్ అడుగుతున్నారు అంటే అది మోసమే అని చెబుతున్నారు.

సైబర్ నేరానికి గురైతే ఇలా చేయండి

అనధికారిక సైట్లలో ముందస్తు చెల్లింపులు చేయకండి అని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ దేశంలో గ్యాస్ ఏజెన్సీలు ఎప్పుడూ ఫోన్ ద్వారా డబ్బులు అడగరని, వ్యక్తిగత వివరాలను అడగరని, కనుక మీ వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు అని సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ నేరానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి కాల్ చేస్తున్నారు.

నేరానికి ఫిర్యాదు చెయ్యాల్సింది ఇప్పుడే

www.cybercrime.gov.in లో ఆన్‌లైన్ ఫిర్యాదు నమోదు చేయవలసి ఉంది. “గోల్డెన్ అవర్” మొదటి రెండు గంటల లోపు ఫిర్యాదు చేస్తే, డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రజలకు సూచనలు చేస్తున్నారు.

ఆంగ్ల సారాంశం

ఇన్‌స్టంట్ గ్యాస్ బుకింగ్ పేరుతో నకిలీ యాప్‌లు, మెసేజ్‌లతో సైబర్ నేరాలు. సైబర్ మోసాలను నిరోధించడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు తెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేయకుండా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Source link