గూడూరులో కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన
గూడూరు, ఆగస్టు 26 (సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో నూతన క్రిమినల్ చట్టాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గూడూరు ఎస్ఐ రాజా కుళ్లాయప్ప ఆధ్వర్యంలో నూతన చట్టాలపై ప్రజలకు వివరించారు. నూతన క్రిమినల్ చట్టాల్లోని ముఖ్యమైన అంశాలు, ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలపై అవగాహన కల్పించారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు గూడూరు ఎస్ఐ రాజా కుళ్లాయప్పతో పాటు ఏఎస్ఐ నర్సింహులు, కానిస్టేబుళ్లు శ్రీరామ్, అశోక్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.