అంతర్జాతీయ
ఓయ్-జక్కీ మహేష్
<!--
--> <!-- -->నైజీరియా గగనతలంలో బుధవారం ఉదయం ఓ పెను ప్రమాదం తృటిలో తప్పింది. నైజీరియాకు చెందిన ‘అరిక్ ఎయిర్’ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం గాల్లో ఉండగా దాని ఎడమవైపు ఇంజిన్ ఒక్కసారిగా పేలిపోయింది. లాగోస్ నుంచి పోర్ట్ హార్కోర్ట్కు బయల్దేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే 27 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విమానం గాల్లో వేగంగా ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం రావడంతో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
చిధ్రమైన ఇంజన్.. వైరల్ అవుతున్న దృశ్యాలు
పేలుడు ధాటికి విమానం ఎడమ ఇంజిన్ బయటి కవచం పూర్తిగా ఊడిపోయింది. ఇంజిన్ లోపలి యంత్ర భాగాలు, వైర్లు బయటకు కనిపిస్తున్న దృశ్యాలను ప్రయాణికులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. విమానం కిటికీలోంచి కనిపిస్తున్న ఆ భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దెబ్బతిన్న తీరును చూస్తే అది ఏ క్షణమైనా కూలిపోతుందేమో అన్నట్లుగా ఉంది. ఇంజిన్లై ముక్కలై గాల్లో ఎగిరిపోయినప్పటికీ.. విమానం అదుపు తప్పకుండా ఉండిపోయింది.

పైలట్ల సాహసం.. సురక్షిత ల్యాండింగ్
పరిస్థితి తీవ్రతను గమనించిన పైలట్లు ఏమాత్రం తడబడకుండా అత్యవసర ప్రొటోకాల్ను పాటించారు. దెబ్బతిన్న ఇంజిన్ను వెంటనే నిలిపివేసి, విమానాన్ని సమీపంలోని బెనిన్ ఎయిర్పోర్టుకు మళ్లించారు. ఉదయం 8:05 గంటల సమయంలో అత్యవసర సేవ మధ్య విమానాన్ని రన్వేపై సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో ఉన్న 80 మంది ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విజయం పైలట్ల నైపుణ్యం నిదర్శనమని విమానయాన నిపుణులు కొనియాడారు.
ఇంజిన్ పేలుడు అత్యవసరంగా నేల దిగిన నైజీరియ విమానం.
ఎ #నైజీరియన్ బోయింగ్ 737 డొమెస్టిక్ ఫ్లైట్ సమయంలో ఎడమ ఇంజిన్పై పెద్ద శబ్దంతో ఇంజిన్ పేలడంతో అత్యవసర ల్యాండింగ్ చేయబడింది, 80 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై విమానయాన సంస్థ దర్యాప్తు చేస్తోంది.#నైజీరియా వార్తలు pic.twitter.com/seMa91mXA4
— ఉన్మై కసక్కుమ్ (@Unmai_Kasakkum) ఫిబ్రవరి 13, 2026
విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు
ఈ ప్రమాదంపై నైజీరియన్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (NSIB) ప్రాథమిక విచారణ చేపట్టింది. ఇంజన్లోని ఒక ‘ఫ్యాన్ బ్లెడ్’ విరిగిపోవడం వల్ల ఈ అంతర్గత పేలుడు సంభవించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనిని విమానయాన పరిభాషలో ‘ఫ్యాన్ బ్లేడ్ ఆఫ్’ ఘటనగా పిలుస్తారు. ఇంజిన్ ముక్కలు విమానం వెనుక భాగంలో స్టెబిలైజర్ను కూడా తాకినట్లు పేర్కొన్నారు. లోహపు అరుగుదల లేదా ఇంజిన్ రూపకల్పనలో లోపాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
స్పందించిన అరిక్ ఎయిర్
ఈ ఘటనపై అరిక్ ఎయిర్ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల భద్రత మీకు మొదటి ప్రాధాన్యతని, ఈ ప్రస్తుతానికి క్షమాపణలు కోరుతున్నట్లు నివేదిస్తుంది. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ బోయింగ్ విమానాన్ని గ్రౌండ్ చేసి, లోతైన సాంకేతిక పరీక్షలు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటామని నైజీరియా విమానయాన అధికారులు స్పష్టం చేశారు.
ఆంగ్ల సారాంశం
ప్లేన్ ఇంజిన్ పేలుడు, అరిక్ ఎయిర్ బోయింగ్ 737లో ఒక భయంకరమైన మిడ్-ఎయిర్ ఇంజన్ పేలుడు నైజీరియాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. తురిమిన ఇంజిన్ మరియు 80 మంది ప్రయాణికులు తృటిలో తప్పించుకున్న వైరల్ వీడియోను చూడండి.