భారతదేశం
ఓయ్-జక్కీ మహేష్
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం అక్రమమని, అనైతికమని ఆయన పేర్కొన్నారు. ఈ యుద్ధం వల్ల భారత్పై శాంతి ప్రభావం దృష్టిలో ఉంచుకుని, స్థాపనలో కేంద్ర ప్రభుత్వం చురుకైన పాత్ర పోషించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఖమేనీపై దాడి అంటే.. ఇరాన్ ఊరుకోదు!
ఒవైసీ మాట్లాడుతూ.. “అయతుల్లా అలీ ఖమేనీ కేవలం ఇరాన్ నాయకుడు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలకు అత్యంత గౌరవనీయమైన మత గురువు. అటువంటి అగ్రనేతను లక్ష్యంగా చేసుకుంటే ఇరాన్ నిశ్శబ్దంగా ఉంటుందని భావించడం పొరపాటు. జెనీవాలో చర్చలు జరుగుతున్న సమయంలో, అదీ ఒక వృద్ధ మత నాయకుడిపై అమానుషం” అని ఆయన అన్నారు. ఈ దాడుల్లో 150 మందికి పైగా పాఠశాల విద్యార్థులు మరణించారని.. పాశ్చాత్య దేశాల మానవతావాదం ఇప్పుడు ఎటు పోయిందని ఆయన ప్రశ్నించారు.

భారత ఆర్థిక వ్యవస్థపై పెను దెబ్బ
యుద్ధం గనుక కొనసాగితే భారత్పై తీవ్ర ప్రభావం పడుతుందని ఒవైసీ హెచ్చరిక. పశ్చిమాల్లో దాదాపు కోటి మంది భారతీయులు భారతీయులు పనిచేస్తున్నారు. విమానాలు రద్దు కావడంతో వేల సంఖ్యలో భారతీయులు మక్కా, మదీనా, దుబాయ్, ఒమన్ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. భారత్ తన అవసరాలకు 80 శాతం పైగా చమురును దిగుమతి చేసుకుంటుంది. చమురు ధరలో ఒక్క డాలర్ పెరిగినా అది భారత ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ అని ఆయన గుర్తు చేశారు.
ప్రధాని మోదీకి విజ్ఞప్తి
ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే జోక్యం చేసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ. ఇరాన్ దశాబ్దాలుగా ఆంక్షలను ఎదుర్కొంటూ తల బలంగా నిలబడిందని, ఒత్తిడికిలొగ్గేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా విదేశీ విధానాల వల్ల గతంలో ఇరాక్, లిబియా, సిరియా దేశాలు ఎలా నాశనమయ్యాయో ప్రపంచం చూసిందని, ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అదే పునరావృతం కాకూడదని ఆయన పేర్కొన్నారు.

