Friday, April 10, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణకొడాలి, వంశీకి ఇక నో ఛాన్స్, చంద్రబాబు భారీ స్కెచ్- టార్గెట్ 2029..!! | గుడివాడ,...

కొడాలి, వంశీకి ఇక నో ఛాన్స్, చంద్రబాబు భారీ స్కెచ్- టార్గెట్ 2029..!! | గుడివాడ, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల లక్ష్యం 2029పై చంద్ర బాబు ప్రత్యేక దృష్టి, వివరాలు ఇక్కడ

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ 2029 లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఆని అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లతో సమీక్షిస్తున్నారు. ముందుగా మచిలీపట్నం పైన సమీక్ష చేసిన చంద్రబాబు.. ప్రత్యేకంగా గుడివాడ.. గన్నవరం నియోజకవర్గాల పైన సేకరించిన సమాచారాన్ని పార్టీ నేతల ముందు ఉంచారు. చేపట్టాల్సిన కార్యాచరణ పైన దిశా నిర్ణయం చేసారు. మిషన్ 2029లో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో తిరిగి సీట్లు నిలబెట్టుకోవాలని సీఎం నేతలకు తేల్చి చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. కీలక నియోజకవర్గాల క్షేత్ర స్థాయి నివేదికలతో సమీక్షలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయం లోనే ఎమ్మెల్యేలతో వరుస భేటీలు అయ్యారు. ప్రతీ అసెంబ్లీలో ఎమ్మెల్యే పని తీరు.. పార్టీ పరిస్థితి.. తాజా నివేదికల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీ, ఇంచార్జి మంత్రితో సమావేశాలు జరిగాయి. ఒక్కొక్కరి ప్రోగ్రెస్ రిపోర్టులను సిద్ధం చేశారు. మచిలీపట్నం లోక్‌సభ నియోజక వర్గ నేతలతో వారి క్షేత్ర స్థాయి నివేదికలను వివరిస్తూ… వారికి రోడ్ మ్యాప్ ఫిక్స్ చేసారు. ఎమ్మెల్యే ల పనితీరుపై ప్రోగ్రెస్‌ రిపోర్టులను సీల్డ్‌ కవర్‌లలో వారికి స్థలం. మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పామర్రు, పెనమలూరు, గుడివాడ నియోజకవర్గాల పనితీరు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. మచిలీ, గన్నవరం, సెగ్మెంట్ల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని మరింత మెరుగుపడాలని సూచించారు.

గుడివాడ-గన్నవరం-అసెంబ్లీ-నియోజక వర్గాలపై-చంద్రబాబు-ప్రత్యేక-ఫోకస్-2029-వివరాలు-ఇక్కడ

చంద్రబాబు టార్గెట్ 2029.. కీలక దిశా నిర్ణయం

కాగా, అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల నడుమ సమన్వయం పూర్తిగా లోపించిందని, సరిదిద్దాలని సూచించారు. అక్కడి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్లినా.. టీడీపీ వారిని కలుపుకొని వెళ్లడంలో అంత చొరవ చూపడం లేదని సీఎం గుర్తించారు. కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్‌ జిల్లా ఎమ్మెల్యేలకు అందుబాటు అవకాశం ఉంది. ఆయన జిల్లాకు వచ్చేది కూడా తక్కువేనని చెప్పారు. ఇకపై ఆయన పద్ధతి మారాలని సూచించారు. కలెక్టర్‌ పనితీరు బాగుందని ఎమ్మెల్యేలందరూ చెప్పారు. ఎస్పీ పనితీరుపై కొందరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. అన్నీ సరిదిద్దుతానని సీఎం హామీ ఇచ్చారు. ఇక.. రాజకీయంగా గన్నవరం నుంచి వల్లభనేని వంశీ.. గుడివాడ నుంచి కొడాలి నాని తిరిగి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయంగా తయారైంది. ఈ నియోజకవర్గాల పైన టీడీపీ నాయకత్వం స్పెషల్ ఫోకస్ చేసింది. 2024 ఎన్నికల్లో ఈ ఇద్దరినీ టీడీపీ అభ్యర్ధులు ఓడించారు. కాగా, వచ్చే ఎన్నికల్లోనూ ఇదే ఫలితం రిపీట్ చేయడం టీడీపీ పట్టుదలతో ఉంది. రానున్న రోజుల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో చోటు చేసుకునే రాజకీయం ఆసక్తిగా మారనుంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular