కల్లూరు ఎమ్మార్వో కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 15 (సీమకిరణం న్యూస్):
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కల్లూరు మండల ఎమ్మార్వో కార్యాలయంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో ఆంజనేయులు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల, సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయ ప్రాంగణాన్ని త్రివర్ణ పతాకాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు మరియు పలువురు స్థానికులు పాల్గొని వేడుకలను దిగ్విజయం చేశారు.