ఆంధ్ర ప్రదేశ్
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->ప్రస్తుతం దేశంలో గ్యాస్ కొరతపై చర్చ జరుగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ కొరత పైన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రాష్ట్ర గ్యాస్ సరఫరాపై ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆయిల్ కంపెనీలు, జై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన జిల్లా మంత్రి నాదెండ్ల మనోహర్ వినియోగదారుల అపోహలకు తావు ఇవ్వద్దు అన్నారు.
గ్యాస్ విషయంలో ఎటువంటి కొరత లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్
గ్యాస్ వినియోగదారుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, సరఫరా, డెలివరీ వ్యవస్థ సక్రమంగా కొనసాగుతున్నాయని అధికారులు మంత్రి నాదెండ్ల మనోహర్కు తెలియజేశారు. ముఖ్యంగా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ విషయంలో ఎటువంటి కొరత లేదు. జిల్లాలవారీగా గ్యాస్ నిల్వతోపాటు, సరఫరాలపై నిరంతరం అవగాహన కల్పించి మంత్రి అపోహలను తొలగించాలని అధికారులను స్వాధీనం చేసుకున్నారు.

అత్యవసర సేవలకు కూడా ఎట్టి పరిస్థితులలోనూ అంతరాయం కలగొద్దు
గృహ వినియోగానికి కాక, పాఠశాలలు, ఆసుపత్రులు, వసతి గృహాలు వంటి అత్యవసర సేవలకు కూడా ఎట్టి పరిస్థితులలోనూ అంతరాయం కలగకూడదని మంత్రి అధికారులు సూచించారు. గృహ అవసరాల కోసం కేటాయించిన గ్యాస్ సిలిండర్, వాణిజ్య అవసరాల కోసం వినియోగించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం.
బ్లాక్ మార్కెట్ నివారణ కోసం ప్రత్యేక నిఘా బృందాలు
బ్లాక్ మార్కెట్ ను అరికట్టడం కోసం ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రస్తుత పరిస్థితులలో ఎక్కడైనా అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే ఆయన అధికారులను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ వినియోగం పైన ప్రజలలో చైతన్యం పెంచాలని, సరైన అవగాహన కల్పించడం ద్వారా సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు.
పారదర్శకంగా, అప్రమత్తంగా గ్యాస్ విషయంలో ఉండాలన్న అధికారులు
పారదర్శకత, బాధ్యతాయుతమైన వ్యవహార శైలి ప్రజల విశ్వాసం నిలబడుతుందని ఆయన తెలిపారు. అధికారులు, ఆయిల్ కంపెనీలు సమన్వయంతో పనిచేస్తే ఎటువంటి సంక్షోభం అయినా సమర్థంగా ఎదుర్కోవచ్చు. పారదర్శకంగా, అప్రమత్తంగా గ్యాస్ విషయంలో ఉండాలని సూచించారు మంత్రి నాదెండ్ల మనోహర్.
ఆంగ్ల సారాంశం
ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కొరత. గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ వివరణ ఇచ్చారు. గ్యాస్ కొరతపై అధికారులు, చమురు కంపెనీలకు మంత్రి నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు.