ఏడుగురు మృతి చెందడం బాధాక‌రం : మంత్రి బీసీ జనార్థ‌న్

ఏడుగురు మృతి చెందడం బాధాక‌రం : మంత్రి బీసీ జనార్థ‌న్..   పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై మంత్రి బీసీ జనార్థ‌న్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.