ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఎం. హరికృష్ణ
ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఎం. హరికృష్ణ వెల్దుర్తి, సెప్టెంబర్ 15, (సీమకిరణం న్యూస్) : ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం, బాధితులకు న్యాయం అందించడంలో కీలకమైన ఎస్సీ, ఎస్టీ సబ్ డివిజన్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎం. హరికృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు కర్నూలు రెవెన్యూ డివిజనల్ అధికారి, ఎస్సీ, ఎస్టీ సబ్ డివిజన్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ కె. సందీప్కుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ...