seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 12:21 am Digital Edition : SEEMA KIRANAM

ఉమెన్స్ డే వేళ సీఎం రేవంత్ ఊహించని కానుక..!! | కాలేజీ విద్యార్థినులకు సీఎం రేవంత్ మహిళా దినోత్సవ కానుకను త్వరలో అమలు చేస్తామని ప్రకటించారు

తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

మహిళా దినోత్సవం వేళ సీఎం రేవంత్ ప్రకటన చేసారు. భారీ కానుక ప్రకటన. తమ ప్రభుత్వం మహిళల కోసం అనేక నిర్ణయాలు అమలు చేస్తుందని చెప్పారు. మహిళాభ్యున్నతి కోసం తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఉక్కు మహిళ సోనియా కారణంగానే తెలంగాణ కల సాకారం అయిందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో మహిళల కీలక శాఖలకు మంత్రులుగా… శాఖాధిపతులుగా వ్యవహరిస్తున్నారని వివరించారు. మూసీ ప్రాజెక్టులను రేవంత్ వివరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ మహిళా దినోత్సవం వేళ ప్రకటన చేసారు. మహిళలకు ఉపయోగపడే లా త్వరలో పలు పథకాలను ప్రారంభించడం జరిగింది. విద్యార్థులకు ఉచితంగా స్కూటీలు అందించే పథకం పైన స్పష్టత ఇచ్చారు. ఎలక్ట్రిక్ బస్సులపైనా కీలక అంశాలను ప్రస్తావించారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళల్ని ప్రభుత్వం సత్కరించింది. ఇదే సమయంలో విద్యార్థులకు త్వరలో ఉచితంగా ప్రభుత్వ తరపున ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేయబడ్డాయి. కాగా, మూసీ అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. మూసీ ప్రక్షాళనకు ప్రతిపక్షాలు అనుకూలమా..కాదా అని ప్రశ్నించారు. నదుల బఫర్ జోన్లలో కట్టడాలకు అనుమతులు లేవని చెప్పారు. బఫర్‌ జోన్‌లో నిర్మాణాలు చేపడితే తొలగించాలన్నారు. బఫర్ జోన్‌లోని ఇళ్లకు విలువ ఉండదని స్పష్టం చేసారు. ఇలాంటి రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. నష్టపోయేవారికి ఏం ఇవ్వాలంటే దానిపై చర్చించాల్సిన అవసరం ఉందని రేవంత్ చెప్పారు.

CM-revanth-big-announcement-for-college-girls-as-womens-day-gift-implement-Soon

మహిళల కోసం ప్రత్యేక నిర్ణయాలు

కాగా, హైదరాబాద్‌కు కాలుష్యమే అతిపెద్ద సమస్యగా రేవంత్… హైదరాబాద్ నాన్ లివింగ్ సిటీగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాలుష్యం నివారించే బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ప్రపంచ నగర హైదరాబాద్‌ పోటీపడేలా తీర్చిదిద్దాలని. ఔటర్‌ రింగ్ రోడ్డు బయటకు పరిశ్రమలను తరలించాలని… 2026 డిసెంబర్ నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులతో సహా… పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చుతామని చెప్పారు. త్వరలోనే విద్యార్థులకు ఎట్రిక్ స్కూటీలు అందజేయాలని మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. వారి కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని రేవంత్ చెప్పిన సీఎం… డ్వాక్రా సంఘాల ద్వారా రుణం అందజేస్తామని, గృహలక్షి పథకం ద్వారా సబ్సిడీకి గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని డీజిల్‌ బస్సులను 2026 డిసెంబర్‌ల్లోపు జిల్లాలకు తరలిస్తామని చెప్పారు. డిసెంబర్‌ 9లోపు డీజిల్‌ బస్సులు హైదరాబాద్‌లో కనిపించవని తెలిపారు.

ఆంగ్ల సారాంశం

ఎన్నికల హామీ మేరకు కాలేజీ విద్యార్థినులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం

Source link