అంతర్జాతీయ
-కొరివి జయకుమార్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు ఇప్పుడు పూర్తి స్థాయి ఘర్షణలతో మారుతున్నాయి. గత 11 రోజులుగా అమెరికా అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలతో ఇరాన్పై తీవ్ర దాడులు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధ చర్యలు అమెరికా ప్రభుత్వానికి భారీ ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.
సమాచారం ప్రకారం యుద్ధం ప్రారంభమైన తొలి ఆరునెల అమెరికా సుమారు 11 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చులు ఉన్నాయి. భారత కరెన్సీలో ఇది లక్ష కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. యుద్ధ విమానాలు, క్షిపణులు, రక్షణ వ్యవస్థలు, సైనిక కార్యకలాపాల నిర్వహణ వంటి వాటి కోసం ఈ భారీ వ్యయం జరుగుతోంది.

ఈ ఖర్చులపై అమెరికా సెనెట్లో కూడా చర్చ జరిగింది. సెనెటర్ల సమావేశంలో రక్షణ శాఖ అధికారులు వివరాలు. తొలి ఆరు రోజుల్లోనే 11.3 బిలియన్ అంచనా వేశారు. అయితే అమెరికా సెనేటర్ క్రిస్ కూన్స్ ఈ మొత్తం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ముఖ్యంగా రోజుల్లో యుద్ధం ప్రారంభమైన తొలి రెండునే అమెరికా సుమారు 5.6 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను వినియోగించినట్లు సమాచారం. ఆధునిక క్షిపణులు, డ్రోన్లు, వైమానిక దాడులు, నౌకాదళ కార్యకలాపాలు వంటి వాటికి భారీ వ్యయం అవుతోంది.
ఇక ఈ యుద్ధానికి మద్దతుగా ఇజ్రాయెల్ కూడా అమెరికాతో కలిసి ఇరాన్పై దాడులు కొనసాగుతోంది. జనవరి 28 నుంచి ఈ రెండు దేశాలు సంయుక్తంగా సైనిక చర్యలు చేపట్టారు. మరోవైపు ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తూ ప్రతిఘటన కొనసాగుతోంది.
యుద్ధం కొనసాగుతున్న అమెరికా ప్రభుత్వానికి అదనపు నిధుల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ కాంగ్రెస్కు సుమారు 50 బిలియన్ డాలర్ల అదనపు రక్షణ బడ్జెట్ను ప్రతిపాదించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. యుద్ధ కార్యకలాపాలను కొనసాగించడానికి, సైనిక సామగ్రిని పునరుద్ధరించడానికి ఈ నిధులు అవసరమని అధికారులు చెబుతున్నారు.
ఇక మరోవైపు అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ యుద్ధం సైనిక నిల్వలను తగ్గించే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
అత్యాధునిక క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాల వినియోగం కారణంగా అమెరికా సైనికుల నిల్వలు వేగంగా తగ్గుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం మరింత కాలం కొనసాగితే ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా ప్రతీకార చర్యలు చేపడుతుండటంతో ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం మరింత తీవ్రమవుతోంది. ఈ పరిస్థితి ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయంగా భావిస్తున్నారు.

