అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ల యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆ దేశ టాప్ కమాండర్ మహమ్మద్ పక్ పూర్ హతం అయినట్లు సమాచారం. అలాగే ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ ముహమూర్ బగేరీ, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హొస్సేనీ సలామీ.. వీరితోపాటు ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ప్రాణాలు కోల్పోయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ఈ దాడుల్లో మృతి చెందాడని ఇరాన్.
ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇజ్రాయెల్ తాజాగా జరిపిన క్షిపణి దాడుల్లో ఇరాన్ కు చెందిన టాప్ కమాండర్, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) చీఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ పాక్ పూర్ ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి. పక్ పూర్ గతనెలోనే ఇజ్రాయెల్, అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ , అమెరికా నుంచి ఎలాంటి పరిణామాలు ఎదురైనా తక్షణం స్పందించేందుకు తమ సైన్యం సిద్ధమవుతుందని.. గన్ ట్రిగ్గర్ పై వేలు ఎప్పుడూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
ఇక మహమ్మద్ పక్పూర్ గతంలో IRGC గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్గా విధులు నిర్వర్తించారు. అయితే 2025లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అప్పటి కమాండర్ హొస్సేన్ సలామీ హతం అయిన నేపథ్యంలో పక్ పూర్ ను IRGC కొత్త చీఫ్గా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నియమించారు. అయితే తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఈ కమాండర్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది.

మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడుల్లో దక్షిణ ఇరాన్లోని బాలికల పాఠశాల పూర్తిగా దగ్ధం అయినట్లు ఇరాన్ గుర్తించింది. ఈ దాడిలో దాదాపు 30 మందికి పైగా చిన్నారులు మృతి చెందినట్లు స్పష్టం చేసింది. ఈ పరిశీలన ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ ఎన్ ఏ తాజాగా ఉంది. అలాగే యుద్ధ వాతావరణం, ఇజ్రాయెల్ ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రియన్, ఖతార్ దేశాలు తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేశాయి. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.

