తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
<!--
--> <!-- -->ఇందిరమ్మ లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. పెండింగ్ బకాయిల విడుదల పైన నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా బకాయిల కోసం వేచి చూస్తున్న లబ్దిదారులకు రిలీఫ్ దక్కింది. తాజాగా విడుదల చేసిన నిధుల ద్వారా తొలి దశలో 2,764 మంది లబ్ది దారులకు ప్రయోజనం కలగనుంది. మిగిలిన బిల్లుల విషయంలోనూ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇళ్లు మంజూరై నిర్మాణంలో ఉన్న లబ్దిదారులకు తాజాగా నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెండింగ్ బిల్లులను చెల్లించింది. వీటిని నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేసింది. మొత్తం 2,764 మంది లబ్దిదారులకు రూ.28.50 కోట్లు ఇచ్చారు. 99 రోజుల తరువాత ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రారంభించిన వారం రోజుల్లో లబ్దిదారులకు నిధులు విడుదల చేసింది. లబ్దిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించినట్లు హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గౌతమ్ ప్రకటించారు. ఇదే సమయంలో పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ చేసింది. క్లియర్ చర్యలు చేపడుతోంది.

దశల వారిగా చెల్లింపులకు సమాయత్తం
ప్రభుత్వం బిల్లుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలతో ఇళ్ల నిర్మాణాలు మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది. సాంకేతిక సమస్యల వల్ల డబ్బాలు జమ అయితే లబ్దిదారులకు కూడా అందే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రత్యేక డ్రైవ్ చేపడుతోంది. గత వారం రోజుల్లో ఎల్-3 జాబితాలో ఉన్న 1200 మందికి రూ.12.06 కోట్లు విడుదల చేశారు. ఇక బ్యాంక్ వద్ద పెండింగ్లో ఉన్న 653 మందికి కూడా రూ.7 కోట్లు విడుదల చేశారు. ఇక అభ్యంతరాల తర్వాత పెండింగ్లో పడ్డ 911 మంది లబ్దిదారులకు కూడా రూ.9.40 కోట్లు విడుదల చేసింది. కాగా, తొలి విడతలో 4 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్లను పొందారు. ఇక రెండో విడత జాబితాను త్వరలో విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏప్రిల్లో విడత జాబితా కింద మరింతమందిని ఇళ్లను అందించడానికి రెండో ప్రభుత్వం జరిగింది.
ఆంగ్ల సారాంశం
TG ప్రభుత్వం ఇటీవల ₹28.50 కోట్ల విలువైన పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను క్లియర్ చేసింది, 2,764 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చింది.