ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
లడ్డూ వివాదం కొత్త మలుపు తీసుకుంది. లడ్డూ వివాదం పైన శాసనమండలిలో వివాదం చోటు చేసుకుంది. వైసీపీ సభ్యులు ఇందాపూర్ డెయిరీ గురించి ప్రస్తావిస్తూ అధికార కూటమిని టార్గెట్ చేసారు. ఎలాంటి కొవ్వు లేదని సీబీఐ తేల్చిందని శాసనమండలి విపక్షనేత బొత్సా సత్యనారాయణ మండిపడ్డారు. వాస్తవాలు తేల్చాల నే సభలో చర్చించాలని కోరుతున్నామని బొత్సా పేర్కొన్నారు.
శాసన మండలిలో ఇందాపూర్ డెయిరీపై చర్చకు వైయస్ఆర్సీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనితో, బొత్సా సత్యనారాయణ ఇదే వివాదం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక డొల్ల బడ్జెట్ పెట్టారని. హెరిటేజ్ ఇందాపూర్తో చీకటి సంస్థ సభలో బడ్జెట్తో పాటు ఇందాపూర్, హెరిటేజ్పై చర్చించాల్సిందేనని డిమాండ్ చేసారు. ఏ వర్గం అవసరాలు తీర్చలేని బడ్జెట్ ప్రవేశ పెట్టారని. తాము చర్చించాలని కోరితే డైవర్షన్ పాలిటిక్స్ వారు మండి పడ్డారు. తాము చెప్పిన దాంట్లో అవాస్తవాలుంటే వాస్తవాలు తేల్చడానికి చర్చకు రావాలని.. తాము ఆధారాలతో సహా నిరూపిస్తామని బొత్సా సవాల్ చేసారు. 320కి కొనుగోలు చేసే నెయ్యి 700 కి పెంచడం వెనుక కారణం తెలియాలన్నారు. పాల రేటు అప్పట్లో తక్కువ ఇప్పుడు పెరిగిందంటున్నారని.. ఏ సంవత్సరంలో పాల రేటు ఎంతో చర్చపెట్టాలని డిమాండ్ చేసారు.

మండలిలో చర్చ కోసం డిమాండ్
చంద్రబాబు, పవన్కు చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని బొత్సా నిర్ణయించారు. ఈ దోపిడీని బీజేపీ నేతలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు. రైతులు గిట్టుబాటు ధరల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని… నిరుద్యోగులు భృతి కోసం ఉద్యోగాల కోసం చూస్తున్నారని చెప్పారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం చూస్తున్నారని… హెరిటేజ్కు దోచిపెట్టడానికే ఇందాపూర్ను తెచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇందాపూర్ను అడ్డుపెట్టుకుని హెరిటేజ్కు దోచిపెట్టాలని చూస్తున్నారని. ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రలోభాలకు ఆశపడి తమ పార్టీని వదిలిపోయారని చకచకా చేశారు. ఇందాపూర్తో లాలూచీపడి దోచుకోవాలనే ప్రయత్నం జరిగింది.. తాము చెప్పేది అబద్ధమైతే చర్చకు రావాలని డిమాండ్ చేసారు. వైయస్ఆర్సీపీ పరిపాలనలో లోపం ఉంటే ఈ ప్రభుత్వంలో ఆదాయం పెరగాలి కదా అని బొత్సా ప్రశ్నించారు.

