భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. అద్దెకు ఉంటున్న వసతి గృహంలో ఉరి వేసుకున్న స్థితిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హుటాహుటిన ఆమె ఆసుపత్రికి. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ఈ సీసీటీవీ ఫుటేజీలను చూస్తున్నారు. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు.
ఆ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ పేరు చిన్న పాపు. కేరళలోని కాసర్గోడ్ జిల్లా ఆదూర్ ఆమె స్వస్థలం. అసలు పేరు రేష్మా. వయస్సు 24 సంవత్సరాలు. చిన్ను పాపు అనే పేరు మీద సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 50కి పైగా యూట్యూబ్ ఛానళ్లను నిర్వహిస్తున్నారు. అందులో ఉండే క్యారెక్టర్ల పేర్లను తన నిక్ నేమ్ గా పెట్టుకున్నారు. ఆమె మరణం అభిమానుల్లో కలకలం రేపింది. దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఈ మధ్యాహ్నం కాసర్గోడ్లోని చూరి ప్రాంతంలో ఆమె నివాసంలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి చేర్చారు. ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రాథమికంగా పోలీసులు దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్తో పాటు ఇతర ప్లాట్ఫామ్లలో పనిచేస్తూ రెండు లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఆమె అకాల మరణ వార్త అభిమానులను, కాసర్గోడ్ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సోషల్ మీడియా ప్రపంచమంతా ఈ ఘటనతో షాక్ కు గురైంది.
పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక పరిశోధనలు జరిగాయి. మరణానికి కారణం అస్పష్టంగా కనిపిస్తోంది, ప్రాథమిక నివేదికలో దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. ఘటనపై అసాధారణ మరణం కింద కేసు నమోదు చేసి, పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి ఇన్క్వెస్ట్, పోస్టుమార్టం ప్రక్రియ అనంతరం, బంధువులకు అప్పగిస్తున్న అధికారులు.

