భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
కేరళలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేరళ రవాణాశాఖ మంత్రి కే. బి. గణేష్ కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను 5 వేల మంది మహిళలతో ప్రేమాయణం జరిపానని ఇటీవల గణేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలోని SNDP జనరల్ సెక్రటరీ వెళ్లప్పళ్లి నటేషన్.. మంత్రి కే. బి. గణేష్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేశారు.
“విజయమంత్రి కె. బి. గణేష్కుమార్కు మహిళలు, గోల్డ్ అంటే పిచ్చి. అతడు కామాంధుడు. అతడు ఎప్పుడూ చీప్ మ్యానర్లో మాట్లాడుతాడు. వెంటనే పినరయి విజయన్ అతడిపై చర్యలు తీసుకోవాలి. మంత్రిగా ఉన్నవాళ్లు ఎవరైనా తాను 5 వేల మంది మహిళలతో ఎఫైర్ పెట్టినట్లు మాట్లాడుతారా..? నేషన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ప్రజా జీవితంలో మంత్రి గణేష్ కుమార్ ఓ ఫెయిల్డ్ పొలిటీషన్ అని.. గణేష్ కుమార్ భార్య కూడా అతడిపై ఫిర్యాదు చేసిందని నటేషన్ పేర్కొంది. కేబినెట్లో మిగిలినవాళ్లంతా సరిగ్గా పనిచేస్తే ఇతడు మాయని మచ్చగా మారుతున్నాడని ఫైర్ అయ్యారు. మంత్రి స్థానంలో ఉన్నవాళ్లు ఎవరైనా మహిళలపై ఇలా మాట్లాడుతారా..? తాను 5 వేల మంది మహిళలతో ఎఫైర్ పెట్టుకున్నానని అంటాడా..? తనతో ప్రేమ అంగీకరించని మహిళలు మూగవారని, నపుంసకులని అంటున్నాడు. ఇతడి వల్ల కేరళ రాష్ట్రం ప్రతిష్ఠ దెబ్బతింటుందని నటేషన్ గురించి.

మంత్రి మరో వైపు గణేష్ కుమార్ భార్య బిందు మేనన్ ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. గణేష్ కుమార్.. తమ నివాసంలో వేరే మహిళలో ఉండటాన్ని తాను చూశానని కానీ గణేష్ తన తప్పు ఒప్పుకున్నాడని అందుకే పిటిషన్ ను వెనక్కు తీసుకున్నట్లు చెప్పారు. 2014లో పెళ్లి జరిగినప్పటి నుంచి తనతో అనేక ఇబ్బందులు పడ్డానని కానీ ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదని తెలిసింది. ప్రభుత్వాన్ని కించపరచడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

