భారతదేశం
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->లోక్ సభలో రైతు సంక్షేమం కోసం కేంద్రం చేస్తున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాల గురించి సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానం ఇచ్చారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేర్పులు చేసింది.
రైతుల బీమా క్లెయిమ్ లపై మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
రైతులకు బీమా క్లెయిమ్లు సకాలంలో అందేలా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చినట్లు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శాఖను ఏర్పాటు చేసింది. గతంలో రైతులు పంట నష్టపోయిన తర్వాత బీమా క్లెయిమ్లు తమ ఖాతాల్లో జమ కావడానికి నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని కేంద్రమంత్రి గుర్తు చేశారు. ఈ ఆలస్యం రైతులను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని చెప్పారు.

నిర్ణీత గడువులో క్లెయిమ్ ఇవ్వకుంటే 12 శాతం వడ్డీతో ఇవ్వాలి
ఈ సమస్యను ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. రైతులకు సంబంధించిన పంట బీమా కంపెనీలు 21 రోజుల్లోపు క్లెయిమ్లను పరిష్కరించాల్సి ఉందని ఆయన చెప్పారు. నిర్ణీత గడువులో క్లెయిమ్ చెల్లించడంలో విఫలమైతే, సంబంధిత బీమా కంపెనీలు రైతులకు 12 శాతం వడ్డీతో పాటు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ బీమా సంస్థలపై మరింత బాధ్యత పెరుగుతుందని ఆయన లోక్ సభా వేదికగా చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాల వలన ఆలస్యం అయితే వారు వడ్డీతోనే ఇవ్వాలి
అదేవిధంగా, క్లెయిమ్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాల వలన ఆలస్యం జరిగితే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు 12 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. ఈ చర్యలతో రైతులకు న్యాయం జరుగుతుందని, బీమా వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని ఆయన తెలిపారు.
బీమా సమస్యలపై రైతులు ఇలా ఫిర్యాదు చేయాలి
క్లెయిమ్ల సెటిల్మెంట్కు సంబంధించిన సమస్యలు ఎదురైన రైతులు కృషి రక్షక్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయాలని సూచించారు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు రెండు లక్షల 71 వేల ఫిర్యాదులు అందినట్లు కేంద్ర మంత్రి కలిగి. ఆ ఫిర్యాదులను ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కొత్త మార్పులు అమల్లోకి రావడంతో రైతులకు త్వరితగతిన బీమా సాయం అందే అవకాశాలు పెరిగాయి.
ఆంగ్ల సారాంశం
వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్ను నిర్ధారించడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలను ప్రవేశపెట్టింది. క్లెయిమ్లు 21 రోజుల కంటే ఆలస్యం అయితే బీమా సంస్థలు మరియు రాష్ట్రాలు తప్పనిసరిగా 12% వడ్డీని చెల్లించాలి.