ఆగస్టు 5.. కేంద్రం కీలక ప్రకటనకు రంగం సిద్ధం?
డిల్లీ, ఆగస్టు 03, (సీమకిరణం న్యూస్):
దేశ రాజకీయాల్లో ఆగస్టు 5వ తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 2019లో ఇదే రోజున ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిర భూమిపూజ జరిగాయి. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన లేదా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. పాలనా సంస్కరణలు, సామాజిక-ఆర్థిక మార్పులు లేదా చట్టపరమైన సవరణలకు సంబంధించిన ప్రకటన రావచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.