seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 3:30 am Digital Edition : SEEMA KIRANAM

అసెంబ్లీకి జగన్, ఎమ్మెల్యేలు- అక్కడే అసలు ట్విస్ట్..!! | పార్టీ నేతల ఇళ్లపై దాడులకు నిరసనగా అసెంబ్లీ బడ్జెట్ తొలిరోజు సమావేశాలకు హాజరుకావాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు (బుధవారం) నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో సమావేశం ప్రారంభం. ఈ సమావేశాలకు వైసీపీ హాజరు పైన కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ నేతలతో భేటీ సమయంలో జగన్ సభకు హాజరు పైన స్పష్టత ఇచ్చారు. జగన్ తో పాటుగా ఎమ్మెల్యేలు సభకు హాజరు కానున్నారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కాగా.. వైసీపీ ఇదే సమయంలో మరో ఆసక్తి కర నిర్ణయం తీసుకుంది.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు (బుధవారం) ప్రారంభం కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలను ప్రారంభించనున్నారు. ఆ తరువాత బీఏసీ సమావేశం నిర్వహణ.. అజెండా.. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, సమావేశాల తొలిరోజు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగానికి హాజరు కావాలని మాజీ సీఎం జగన్‌ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మాజీ సీఎం హోదాలో జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి పైన శాసనసభా వర్గాలను వైసీపీ నేతలు ఆరా తీసినట్లు తెలిసింది. ప్రస్తుత శాసనసభ సభ్యులు కూడా సుముఖతను వ్యక్తం చేసినట్టు సమాచారం. 2024 ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, గవర్నర్ ప్రసంగ కార్యక్రమం కోసం అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ తర్వాత నుంచి శాసనసభా సమావేశాలను బాయ్‌కాట్‌ చేస్తూ వస్తున్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

పార్టీపై దాడులకు వ్యతిరేకంగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ముష్టిరోజుకు హాజరవ్వాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది.

పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం

గవర్నర్ కు గౌరవం ఇచ్చేలా ఈ హాజరవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఓడిన తరువాత గవర్నర్ ప్రసంగానికి హాజరు అవుతున్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిరసనకు దిగే అవకాశం లేదు. తమ పార్టీ నేతల ఇళ్ల పైన జరిగిన దాడులకు దిగాలని డిసైడ్ అయినట్లు నిరసనలు. అసెంబ్లీ సమావేశం తరువాత పార్టీ ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా.. ఎమ్మెల్యేల గైర్హాజరు పైన కూటమి నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. సభకు హాజరు కాకుండానే జీత భత్యాలు తీసుకొంటున్నారని.. వారి పైన చర్యలు తీసుకునే ఆలోచన ఉంటుంది. ఇటు ప్రభుత్వం పైన రాజకీయం గానూ ఒత్తిడి పెంచే వ్యూహాలతో జగన్ సిద్దం అవుతున్నట్లు సమాచారం. దీంతో.. పార్టీ నేతల సమావేశంలో జగన్ ప్రకటించే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

ఆంగ్ల సారాంశం

ఈ నెల 11న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి హాజరుకావాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.

Source link