seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 5:31 am Digital Edition : SEEMA KIRANAM

అల్లకల్లోలం.. పొద్దుపొద్దునే దరిద్రం. ఎవరి మొహం చూశారో! | స్టాక్ మార్కెట్ క్రాష్: క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో సెన్సెక్స్ 2400 పాయింట్లు క్రాష్; నిఫ్టీ 23800 దిగువన, రూపాయి పతనం

వ్యాపారం

ఓయి-లింగారెడ్డి గజ్జల

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. సోమవారం (మార్చి 09, 2026) ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలై, ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, ముడి చమురు ధరల అసాధారణ పెరుగుదల దేశీయ సూచీలను పాతాళానికి నెట్టేశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,400 పాయింట్ల మేర పతనమై ఇన్వెస్టర్లను వణికించింది.

ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్‌కు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 26 శాతం మేర కోల్పోలేని దెబ్బగా మారింది. ఇది జూలై 2022 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి ఉండదు. చమురు ధరల పెరుగుదల వల్ల దేశంలో రవాణా ఖర్చులు పెరిగి, ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్) నియంత్రణ తప్పుతుందనే ఆందోళన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు (ప్రాఫిట్ బుకింగ్) మొగ్గు చూపారు.

స్టాక్ మార్కెట్ క్రాష్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో సెన్సెక్స్ 2400 పాయింట్లు కుప్పకూలింది నిఫ్టీ 23800 రూపాయి పతనం క్రింద

అల్లకల్లోలంలో సూచీలు – రూపాయి పతనం

ఉదయం 9:30 గంటల సమయానికి మార్కెట్ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. సెన్సెక్స్ 2.87 శాతం క్షీణించి 76,505 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 726 పాయింట్లు నష్టపోయి 23,724 స్థాయికి పడిపోయింది. మరోవైపు డాలర్‌తో ప్రస్తుత రూపాయి మారకం విలువ 92.25 వద్ద పడిపోవడం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచింది. మార్కెట్ అస్థిరతను సూచించే ‘ఇండియా విక్స్’ (ఇండియా VIX) ఏకంగా 21 శాతం పెరిగి 24.18 స్థాయికి చేరడం ఇన్వెస్టర్ల భయాందోళనలకు అద్దం పడుతోంది.

ఒక్క కోల్ ఇండియా మినహా.. అన్నీ నష్టాలే

మార్కెట్ పతనంలో దాదాపు అన్ని రంగాలు కుప్పకూలాయి. నిఫ్టీ సూచీలో ఉన్న దిగ్గజ సంస్థలైన టాటా స్టీల్, మారుతీ సుజుకీ, ఎస్‌బీఐ, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి స్టాక్స్ భారీగా నష్టపోయాయి. పెరిగిన ఇంధన ధరల ప్రభావంతో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) షేర్లు కుంగాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా మాత్రమే లాభాల్లో ట్రేడ్ అవుతూ మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.

ఆంగ్ల సారాంశం

సెన్సెక్స్ 2400 పాయింట్లు పడిపోవడం మరియు నిఫ్టీ 23,800 దిగువన జారిపోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ‘బ్లాక్ సోమవారం’ను ఎదుర్కొంటాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు మరియు మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు భారీ అమ్మకాలను ప్రేరేపిస్తాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 92.25గా ఉంది.

Source link