భారతదేశం
ఓయ్-సయ్యద్ అహ్మద్
<!--
--> <!-- -->భారత్ సహా పలు దేశాలు భారీ ఎత్తున సుంకాలు (టారిఫ్లు)విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) తీసుకున్న నిర్ణయాలను అక్కడి సుప్రీంకోర్టు (సుప్రీం కోర్ట్) తాజాగా నిలిపేసింది. విదేశాలపై సుంకాలు విధించే హక్కు అధ్యక్షుడికి లేదని, కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందని తేల్చేసింది. దీంతో భారత్ పై తగ్గింపుల తర్వాత 18 శాతం చేరిన సుంకాలు కాస్తా 10 శాతం తగ్గాయి. ట్రంప్ స్పందించి తదుపరి చర్యలను కూడా తెలియజేసారు. ఈ నేపథ్యంలో భారత్ ఇవాళ తాజా పరిణామాలపై స్పందించింది.
అమెరికా సుంకాల పరిణామాలు, వాటి పర్యవసానాలను భారత ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పును తీసుకుని, ఈ విషయంలో ట్రంప్ నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ప్రస్తావించింది. సుంకాలపై నిన్న అమెరికా సుప్రీంకోర్టు తీర్పును తాము గమనించామని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశంలో ప్రసంగించారని కేంద్రం ప్రకటించింది.

సుప్రీంకోర్టు తన గత దిగుమతి సుంకాలను ఎత్తివేసిన కొన్ని గంటల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, అన్ని దేశాల నుండి దిగుమతులపై 10% సుంకం విధిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశానని. ఇది తన వాణిజ్య ఎజెండాను పెంచడానికి. కొత్త సుంకాలు ఫిబ్రవరి 24 ఉదయం 10:31 గంటలకు భారత కాలమానం ప్రకారం అమల్లోకి రానున్నాయి. డొనాల్డ్ ట్రంప్ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, ఆ దేశం తాత్కాలికంగా 10 శాతం సర్ఛార్జ్ విధిస్తూ కొత్త ఉత్తర్వు జారీ చేయడంతో, భారతీయ వస్తువులు ఫిబ్రవరి 24 నుండి 10 శాతం పరస్పర సుంకాన్ని మాత్రమే ఎదుర్కొంటాయని వైట్ హౌస్ స్పష్టం చేసింది.