అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->అమెరికా- ఇరాన్ మధ్య మూడో విడత చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే అమెరికా సుంకాలపై నెలకొన్న అనిశ్చితి కూడా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడానికి ఓ కారణం అని చెప్పొచ్చు. అమెరికా-ఇరాన్ చర్చల నేపథ్యంలో ఈ చర్చలు సఫలీకృతం అయినా లేక ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగితే ఇరాన్పై ఆంక్షలు తొలగిపోతాయి.
అమెరికా- ఇరాన్ మధ్య మూడో విడత చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గాయి. ఈ మేరకు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్, డబ్ల్యూటీఐ (WTI) ధరలు కూడా క్షీణించాయి. బ్రెంట్ క్రూడ్ 76 సెంట్లు తగ్గి 71.03 కు చేరగా WTI క్రూడ్ 75 సెంట్లు తగ్గి 65.75 డాలర్లకు చేరినట్లు సమాచారం. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్రంప్ టారిఫ్స్ ను 10 శాతం నుంచి 15 శాతం పెంచడం కూడా క్రూడ్ ఆయిల్ డిమాండ్ పై ప్రభావం చూపింది. అయితే ఈ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయని ఛాన్స్ మార్కెట్ విశ్లేషకులు.
ఇక అమెరికా- ఇరాన్ మధ్య చర్చలపై ఒమన్ విదేశాంగ మంత్రి అల్బుసైదీ కీలక అంశాలు. ఇరాన్ అణు కార్యక్రమంలో అమెరికా- ఇరాన్ మధ్య ఈ వారాంతంలో జెనీవాలో మూడో రౌండ్ చర్చలు జరుగుతాయి. ఈ చర్చలకు ఒమన్ మధ్యవర్తిత్వం ఉంటుందో. మరోవైపు..పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే అమెరికా, ఇరాన్ రెండు దేశాలు తమ సైన్యాలను సిద్ధంగా ఉంచినట్లు అల్బుసైదీ స్పష్టం చేశారు.

అలాగే ప్రస్తుతం అమెరికాలో టారిఫ్ లపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రపంచ దేశాలపై ట్రంప్ సుంకాలు విధించడం చట్టరిత్యా వ్యతిరేకమంటూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫిబ్రవరి 24 మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు అధిక టారిఫ్ ల వసూలు ఫిబ్రవరి 24 నుంచి ఆగిపోనున్నాయి. ఇక ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ట్రంప్ వరుసగా 10 శాతం, ఆ తర్వాత 15 శాతం టారిఫ్ లు పెరిగిన విషయం తెలిసిందే.