seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 2:48 pm Digital Edition : SEEMA KIRANAM

వార్త అమీర్‌ ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

వార్త విలేఖరి అమీర్‌ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ 

వెల్దుర్తి, మార్చి 12, (సీమకిరణం న్యూస్) :

 

కర్నూలు జిల్లా వెల్దుర్తి గత వారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వెల్దుర్తి వార్త విలేఖరి అమీర్‌ ని గురువారం వారి ఇంటికి వెళ్లి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ తన సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు. పరామర్శించిన వారిలో వైకాపా నాయకులు రవి రెడ్డి, జడ్పిటిసి సుంకన్న సుదేపల్లి శర్వా రెడ్డి, వెంకటేష్ రెడ్డి, అశోక్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కృష్ణారెడ్డి, చక్రి రెడ్డి, కేశవ్ ఉన్నారు.