seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 8:28 am Digital Edition : SEEMA KIRANAM

అమరావతి పనులపై మంత్రి సీరియస్, “పనిచేయకుంటే వెళ్లిపోండి” | అమరావతి ఆలస్యంపై కాంట్రాక్టర్లకు మంత్రి నారాయణ హెచ్చరిక; 4,026 క్వార్టర్స్ మరియు రోడ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది

ఆంధ్ర ప్రదేశ్

ఓయి-లింగారెడ్డి గజ్జల

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో జాప్యాన్ని ప్రభుత్వం ఇక ఎంతమాత్రం సహించే ప్రసక్తే లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సోమవారం నేలపాడు నిర్మాణం గెజిటెడ్ అధికారులు, గ్రూప్-డి క్వార్టర్ల నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. పనుల వేగంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, లక్ష్యాలను చేరుకోలేని నిర్మాణ సంస్థలపై నిప్పులు చెరిగారు. “పనిచేయలేకపోతే తప్పుకోండి.. అంతేకానీ కాలయాపన వద్దు” అంటూ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులకు ముఖం మీదే తేల్చి చెప్పారు.

క్షేత్రస్థాయిలో పనులు మందకొడిగా సాగడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన రాజధాని పనుల్లో అలసత్వం చూపిస్తున్నారంటూ షాపూర్ జీ పల్లోంజీ కన్‌స్ట్రక్షన్ సంస్థపై అసహనం వ్యక్తం చేశారు. లక్ష్యానికి అనుగుణంగా పనితీరు లేని సదరు సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను తక్షణమే పంపించాలని అధికారులను ఆదేశించడం సంచలనం సృష్టించింది. “ప్రభుత్వం గట్టిగా అడిగే రోజులు వచ్చాయి, నిర్దేశించిన గడువులో ఇటుక పడాల్సిందే” అని హెచ్చరిక.

అమరావతిలో 4 026 క్వార్టర్లు, రోడ్ల నిర్మాణ పనులు ఆలస్యం కావటంతో కాంట్రాక్టర్లను హెచ్చరించిన మంత్రి నారాయణ

రాజధానిపై విమర్శలు అర్థరహితం

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ, గత ప్రభుత్వంపై నిశిత విమర్శలు చేశారు. రాజధానిపై నాయకులు చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, ప్రజలు వారి నిరాధార మాటలను నమ్మే స్థితిలో లేరని అన్నారు. “గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడకుండా ఉండి ఉంటే, నేడు అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా వెలుగొందేది” అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన పనులను మళ్లీ గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది.

మూడేళ్లలో పరిపాలన నగరం..

ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ మంత్రి కీలక ప్రకటనలు చేశారు. ప్రస్తుతం 4,026 గృహాల నిర్మాణం వివిధ దశల్లో ఉందని, వాటిని త్వరగా పూర్తి చేసినట్లు చెప్పారు. వచ్చే 3 నెలల్లో ప్రధాన నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు. వర్షాకాలం రాకముందే డ్రైనేజీ, భూగర్భ కేబుల్ పనులను పూర్తి చేసి, వర్షం పడినా నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేస్తున్నాం. రానున్న మూడేళ్లలో పూర్తిస్థాయి పరిపాలన భవనాలను అందుబాటులోకి తెచ్చి, పాలనను ఇక్కడి నుంచే పరుగులు తీయవచ్చని ధీమా వ్యక్తం చేశారు.

ఆంగ్ల సారాంశం

మంత్రి నారాయణ అమరావతి నిర్మాణ స్థలాలను పరిశీలిస్తారు, ఆలస్యాలపై షాపూర్జీ పల్లోంజీని హెచ్చరిస్తున్నారు మరియు పరిపాలనా భవనాలు మరియు రహదారి మౌలిక సదుపాయాల కోసం 3 సంవత్సరాల ప్రణాళికను వివరించారు.

Source link