తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఫిబ్రవరి 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. నేటి సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుంది.దీంతో ప్రచారం పీక్స్ కు చేరుకుంది. ఇందులోనే ప్రలోభాల పర్వం కూడా మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రయత్నిస్తున్నారు.
ఓట్ల కోసం మొదలైన ప్రలోభాలు
ప్రచార గడువు ముగిసింది, అభ్యర్థులు ఇప్పుడు తాయిలాల పంపిణీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో రాత్రి వేళల్లో జరగాల్సింది అంతా జరిగిపోతుంది. రాత్రివేళల్లో సన్నిహితులతో రహస్యంగా ఇంటింటికీ వెళ్లే అభ్యర్థులు, ఓటర్ల కాళ్లు పట్టుకుని, నజరానాలందించి తమకే ఓటు వేయాలని ప్రమాణాలు చేస్తున్నారు.ఆయ మున్సిపాలిటీలలో ఓట్లను ఇవ్వగలిగిన కీలక నేతల ఇళ్లకు వెళ్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో ప్రలోభాలు పీక్స్ లో.. ఎందుకంటె
ముఖ్యంగా ప్రలోభాలు రంగారెడ్డి జిల్లాలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రంగారెడ్డి ఏర్పాటు చేవెళ్ల, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, శంకరపల్లి, షాద్నగర్ సహా మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ఖర్చుకు వెనకాడటం లేదు. అక్కడ చాలా మంది రియల్టేట్ లావాదేవీలు చేస్తున్న ఎస్ వారే ఉండటంతో వారు డబ్బు బాగా ఖర్చు పెట్టటానికి అయ్యారు.
ఒకరు టీవీ, మరొక అభ్యర్థి ఫ్రిజ్.. వామ్మో తాయిలాలు బాగానే
తాజాగా ఒక వార్త మొయినాబాద్ మున్సిపాలిటీలో హల్ చల్ చేస్తుంది.ఒక వార్డు అభ్యర్థి నలుగురు ఓటర్లు ఇంట్లో పాతటీవీ చూసి కొత్తటీవీ పంపారు. విషయం తెలిసిన ప్రత్యర్థి, కొత్త ఫ్రిజ్తో అదే ఇంటికి వెళ్లి మిగిలిన ఓట్లు తనకు వేయాలని ప్రమాణం చేయించారు అని స్థానికంగా జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు మొయినాబాద్ లోనే కాదు రంగారెడ్డిజిల్లా పరిధిలోని అనేక మున్సిపాలిటీల పరిధిలో కొత్త టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు దర్శనమిస్తున్నాయి.
టోకెన్ అమౌంట్ ఫర్ ఓటు
ఇదిలా ఉంటే శంకరపల్లి మున్సిపాలిటీలో అభ్యర్థులు ‘టోకెన్ అమౌంట్’గా రూ. 5,000 పంపిణీ చేసిన సమాచారం. ఎన్నికలయ్యాక ఇంకా నగదు ఇస్తామని హామీ ఇచ్చి ఓటర్లచే ప్రమాణం చేయించుకున్నారని స్థానికంగా చర్చ జరుగుతుంది. జనరల్ అవుతాకు రిజర్వ్ అయినందున, గెలిస్తే ఛైర్మన్ను తీసుకుంటున్న ఒక మహిళలకు చీరెలు, మిక్సీలతో పాటు నగదును పంచుకునేందుకు కూడా సమాచారం.
అభ్యర్థుల హామీలు ఓటర్లు
అభ్యర్థుల ప్రలోభాలకు లోనవుతున్న ఓటర్లు కూడా తెలివిగా ఉన్నారు. వస్తువులు ఇచ్చిన అభ్యర్థులు ఓడిపోతే వస్తువులు తిరిగి ఎక్కడ ఇచ్చెయ్యమంటారో అని ముందే ఊహించి, అభ్యర్థులతో ఇచ్చిన బహుమతులు తిరిగి అడగకూడదని ముందే హామీలు ఇస్తున్నారు. ఏది ఏమైనా ఈ ప్రలోభాలను కట్టడి చెయ్యాల్సిన అవసరం ఉంది, ఓటు అనేది ప్రలోభాలకు లొంగి వేస్తే రేపు వాళ్ళు మీకు ఇచ్చిన దానికి డబుల్ వసూలు చేస్తారని, అలాంటి వాళ్ళను ఎన్నుకోవద్దని అధికారులు చెబుతున్నారు.
ఆంగ్ల సారాంశం
మునిసిపల్ ఎన్నికలకు ముందు, పెద్ద ఎత్తున ప్రలోభాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఆందోళనలు చేస్తూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, నగదు కూడా పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.